iDreamPost

మైనర్ పై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్

మైనర్ పై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్

జూబ్లిహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ పై లైంగిక దాడి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసు తర్వాత.. భాగ్యనగరంలో నాలుగైదు అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మహిళలు, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా మధ్యప్రదేశ్ లో మరో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జూన్ 2న జరిగిన ఈ ఘటన.. బాలిక ఫిర్యాదుతో బయటికొచ్చింది.

మైనర్ పై అత్యాచారం చేయడమే కాకుండా.. దానిని లైవ్ స్ట్రీమింగ్ చేశారు ఆ దుర్మార్గులు. ఈ దారుణం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరంలో జరిగింది. పదహారేళ్ల మైనర్ పై అత్యాచారం చేస్తూ.. ఆ దారుణాన్ని తమ మిత్రుడిని లైవ్ స్ట్రీమ్ చేశారు. జూన్‌ 2న ఓ హోటల్‌కు తీసుకెళ్లి తనపై అఘాయిత్యం చేశారని బాలిక శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక.. లైంగిక దాడి సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను వారిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారని ఫిర్యాదులో తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి