iDreamPost

యువతి విషయంలో గొడవ.. రచ్చ చేసిన గౌతమ్ సవాంగ్ కుమారుడు

యువతి విషయంలో గొడవ.. రచ్చ చేసిన గౌతమ్ సవాంగ్ కుమారుడు

హైదరాబాద్‌లో పబ్ కల్చర్ ఎక్కువ. ఆర్థిక స్తోమత అధికంగా ఉన్న యువతీ,యువకులు అర్థరాత్రి వరకు పబ్‌లో తప్పతాగుతూ చిందులు వేస్తుంటారు. ఆ సమయంలో కొంత మంది విచక్షణ కోల్పోతుంటారు. ఇక్కడకు ఎక్కువగా సెలబ్రిటీలు, వారి పిల్లలే వస్తుంటారు. తాజాగా ఓ అమ్మాయి విషయంలో గొడవ పడుతూ వార్తల్లో నిలిచాడు ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, ప్రస్తుత ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్. నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. బుధవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10లో ఉన్న జీరో 40 పబ్ వద్ద నడిరోడ్డుపై కొంత మంది యువకులు దాడి చేసుకున్నారు. వారిలో డేవిడ్ సవాంగ్ ఓ యువకుడిపై దాడి చేశాడు.

పబ్ దగ్గర నడి రోడ్డుపై యువకులు రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు. పార్కింగ్ విషయంలో గొడవ జరిగిందని ఓ వర్గం చెబుతుండగా.. ఓ యువతి విషయంలో ఘర్షణ తలెత్తిందని మరో వర్గం యువకులు వాపోతున్నారు. ఈ దాడిలో డేవిడ్ సవాంగ్.. సిద్దార్ధ్ అనే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో అతడి మొహం, కన్ను, చేతులకు గాయాలయ్యాయి. ఈ గొడవ గురించి సమాచారం అందండంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇరు వర్గాల యువకులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి