iDreamPost

టాలీవుడ్ లో ఫహద్ ప్లానింగ్ బాగుందే

టాలీవుడ్ లో ఫహద్ ప్లానింగ్ బాగుందే

కొన్ని నెలల క్రితం పుష్పలో మెయిన్ విలన్ గా మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ ని ఎంచుకున్నప్పుడు అందరూ షాక్ అయ్యారు. అక్కడ బాగా డిమాండ్ ఉన్న టైంలో కెరీర్ పీక్స్ లో వెళ్తున్న సమయంలో ఇదెందుకు ఒప్పుకున్నాడా అని కేరళ మీడియా సైతం కథనాలు రాసింది. అయితే దర్శకుడు సుకుమార్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం, తనను చూపించబోయే తీరు అన్నీ విపరీతంగా నచ్చేయడంతో ఫహద్ ఎక్కువ ఆలోచించలేదు. ఒక షెడ్యూల్ లో పాల్గొన్నాడు కూడా. లాక్ డౌన్ వల్ల బ్రేక్ వల్ల కొంత గ్యాప్ తీసుకున్న పుష్ప మళ్ళీ రీ స్టార్ట్ కాబోతున్న తరుణంలో త్వరలోనే హైదరాబాద్ కు ఫహద్ రాబోతున్నాడు. కథ ఇక్కడితో అయిపోలేదు.

తాజాగా రామ్ చరణ్ – శంకర్ కాంబోలో రూపొందబోయే మూవీలో కూడా తనను ఒక ముఖ్యమైన క్యారెక్టర్ కోసం సంప్రదించినట్టు సమాచారం. మాములుగా శంకర్ సినిమాల్లో విలన్లు చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. ప్రేమికుడులో గిరీష్ కర్నాడ్, ఒకే ఒక్కడులో రఘువరన్, రోబోలో డానీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీళ్ళకు హీరోతో సమానంగా స్పేస్ ఇవ్వడం వల్ల ఆయా సినిమాలు ఎంతగా ఎలివేట్ అయ్యాయో చూశాం. ఇప్పుడు అదే తరహాలో పాత్రను ఆఫర్ చేయడం వల్ల ఫహద్ పాజిటివ్ గా ఉన్నట్టు చెన్నై అప్ డేట్. శంకర్ మూవీ అంటే ఎవరు మాత్రం వద్దంటారు. సో చరణ్ తో ఢీ కొట్టేది ఫహద్ అన్నది అఫీషియల్ కావాల్సి ఉంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీకి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అంజలి మరో ముఖ్యమైన పాత్రను చేయబోతోంది. తమన్ ఇప్పటికే ఒక పాట రికార్డింగ్ పూర్తి చేశాడు. ఇంతవేగంగా శంకర్ తన సినిమా పనులను ఎన్నడూ చేయలేదు. బడ్జెట్ కూడా మరీ వందల కోట్లలో కాకుండా చాలా రీజనబుల్ గా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారట. పాన్ ఇండియా మూవీనే అయినప్పటికీ దీనికి గ్రాఫిక్స్ మరీ భారీ స్థాయిలో అవసరం లేకపోవడంతో త్వరగానే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. ఇదయ్యాకే శంకర్ అపరిచితుడు హిందీ రీమేక్ వైపు వెళ్తారు

Also Read : హమ్మయ్యా – రిలీజ్ డేట్ వచ్చేసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి