iDreamPost

ఏపీలో తాజాగా 57 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో తాజాగా 57 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 57 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2157 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా  1252 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 857 గా నమోదయింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 48 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో  రాష్ట్రంలో 57 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధికంగా  చిత్తూరులో 14,నెల్లూరులో 14మందికి కరోనా సోకగా కర్నూల్ లో 8,కృష్ణా లో 9 , అనంతపురంలో 4, విశాఖపట్నంలో ,విజయనగరం 3, విశాఖపట్నం 2, తూర్పు గోదావరిలో ఒకరికి కరోనా వైరస్ నిర్దారణ అయింది. దీంతో మొత్తం 57 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి