iDreamPost

చంద్రబాబుకు చరిత్ర కళ్ల ముందు కదిలిందట

చంద్రబాబుకు చరిత్ర కళ్ల ముందు కదిలిందట

తెలుగుదేశం అధినేత కు జరుగుతున్న అడుగడుగునా అవమానాలకు కారణాలు ఏమిటన్న చర్చ తెలుగుతమ్ముళ్లలో మొదలైంది. ఆయన 14 ఏళ్ళ పరిపాలనలో అధికారం చేతిలో ఉండగా చంద్రబాబు అనుసరించిన విధానాలు ఆయనకే జగన్ రుచి చూపిస్తున్నారని తమ్ముళ్లకు అర్ధం అవుతోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను గద్దెదించే ముందు వైశ్రాయి వేదికగా ఎమ్యెల్యేల చేత నాడు చంద్రబాబు చెప్పులు వేయించారు. సొంత మామ, పార్టీ అధినేత పై జరిగిన ఈ దాడిని ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సమర్ధించుకున్నారు. పత్రికా వ్యవస్థను, అధికార యంత్రంగాన్ని గుప్పిట పెట్టుకుని వ్యవస్థలను మ్యానేజ్ చేసి నాడు చంద్రబాబు చేసిన ధిక్కారాన్ని నేడు పాతికేళ్ళ తరువాత ఇలాఎదురవుతుందని బహుశా టిడిపి అధినేత ఉహించి వుండరని విశ్లేషకులంటున్నారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలను తగ్గించాలని ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గి సర్కార్ తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది. ఆనాడు ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులను ప్రయోగించి కాల్పులకు సైతం దిగి పలువురి ప్రాణాలు పోయేలా ప్రభుత్వం వ్యవహరించింది. బషీర్ బాగ్ కాల్పులు ఇప్పటికి చీకటి రోజులను గుర్తు చేస్తాయి. నాడు విపక్ష నేతగా వైఎస్ ఆమరణ దీక్ష చేస్తుంటే ఉద్యమ శిబిరంపైనా పోలీసులు దాడి చేసి ఆయన దీక్షను భగ్నం చేసేసారు. ఇలా చంద్రబాబు 9 ఏళ్ళ పాలన అంతా పోలీస్ రాజ్యంగానే సాగిందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు పాలనలో సాగిన దళిత ఉద్యమాలను చంద్రబాబు సర్కార్ 2014 తరువాత ఉక్కుపాదంతో అణచివేసింది. మంద కృష్ణ మాదిగ ఎస్సి వర్గీకరణ పై చేసిన పోరాటాలు ఆ తరువాత అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం, దళితులపై వివక్ష, దళితులపై అత్యాచార అంశాలపై మాజీ ఎంపీ హర్ష కుమార్ చేపట్టిన ఉద్యమాలను చంద్రబాబు ప్రభుత్వం తొక్కేసి కేసులు పెట్టింది. నెలల తరబడి హర్ష కుమార్ కి గృహ నిర్బంధం తప్పనే లేదు. ఇక అనేక వందల మంది దళిత నాయకులకు గృహ నిర్బంధాలు షరా మాములే.

ఇక కాపు రిజర్వేషన్ల అంశంలో ఉద్యమం మొదలు పెట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి చంద్రబాబు సర్కార్ చుక్కలు చూపించింది. తుని లో జరిగిన విధ్వంసాన్ని సాకుగా చూపి ముద్రగడ కుటుంబాన్ని దీక్ష విరమణ కోసం పోలీసులు చితక్కొట్టారు. ముద్రగడను రాజమండ్రి ఆసుపత్రిలో రెండు వారాలకు పైగా ఉంచి రోగులను సైతం వెళ్లనీయకుండా పరిసరాల్లో ముళ్ల కంచె పరిచారు పోలీసులు. ఆ తరువాత ఆయన ఏ ఉద్యమాన్ని చేపట్టాలన్నా గృహ నిర్బంధం లో ఉంచి పోలీస్ మార్క్ ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఈ సందర్భంగా ముద్రగడకు మద్దతుగా కాపు నేతలు కానీ ఉద్యమ కార్యకర్తలు ఎవరు రాకుండా ఐదేళ్లపాటు కొనసాగించింది.

విపక్ష నేతగా విశాఖలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు వచ్చిన జగన్ ను రన్ వే పైనే చంద్రబాబు సర్కార్ అరెస్ట్ చేయించింది. బలవంతంగా ఆయన్ను హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించింది నాటి ప్రభుత్వం. ఆ తరువాత విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసు లోను నాటి అధికార టిడిపి ఆ హత్యాయత్నం కేసును నవ్వులాటగా ప్రచారం సాగించింది. అలాగే వైసిపి అధినేతగా జగన్ పాదయాత్ర కు కోర్టు ద్వారా అనేక అడ్డంకులు కల్పించింది వైఎస్సార్సీపీ గుర్తు చేస్తోంది. ఇవన్నీ తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. బాబు నాటి తన పాలననే నేడు జగన్ ఆయనకు రుచి చుపిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి