iDreamPost

శోభాశెట్టితో పెట్టుకున్న రతికా రోజ్.. ఈసారి అంత ఈజీ కాదు..!

శోభాశెట్టితో పెట్టుకున్న రతికా రోజ్.. ఈసారి అంత ఈజీ కాదు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మీరు ఇప్పటివరకు చూసిన గేమ్ ఒక ఎత్తు అయితే.. ఇకపై మీరు చూడబోయేది ఒక ఎత్తు అవుతుంది. ఎందుకంటే హౌస్ లో ఇప్పుడిప్పుడే అసలు ఆట మొదలు కాబోతోంది. అందరూ మంచితనం, మొహమాటం అనే పదాలకు కాస్త దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హౌస్ లో చాలానే గొడవలు జరిగాయి. ఇప్పుడు అవి మరో స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హౌస్ లో జరిగిన టాస్కులో రణధీర టీమ్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే మహాబలి టీమ్ ఆట గెలవకపోయినా.. మంచి కంటెంట్ అందించే పని చేసింది. ఇప్పుడు ఆ పని వల్లే అసలు ఆట జరగబోతోంది.

విషయం ఏంటంటే.. హౌస్ లో మాయాస్త్రం టాస్కు జరుగుతున్న సమయంలో మహాబలి టీమ్.. రణధీర టీమ్ సాధించిన తాళం కొట్టేయాలని చూసింది. కానీ, అది వాళ్ల వల్ల కాలేదు. తల దొరకనప్పుడు కడుపు మీద అయినా కొడదాం అనుకుందో ఏమో.. శుభశ్రీ వెళ్లి ఆట సందీప్ పవరాస్త్రాన్ని దొంగిలించింది. ఆ విషయాన్ని ధామినీతో కలిసి కెమెరా దగ్గరకు వెళ్లి బిగ్ బాస్ కి కూడా చెప్పింది. టాస్కు జరుగుతూ ఉన్నంత సేపు ఆ విషయం ఎవరికీ తెలియదు. అయితే రణధీర టీమ్ మాయాస్త్రాన్ని సొంతం చేసుకుని టాస్కు పూర్తైన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. అందరూ కలిసి ఆ పవరాస్త్రం కోసం వెతుకులాట మొదలు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ ని జల్లెడ పట్టారు. ఆ పవరాస్త్రాన్ని దొంగిలించిన శుభశ్రీ మాత్రం ఏమీ తెలియనట్లు అలాగే ఉంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు తీశారు? ఎవరు తీశారు? అంటూ ఒకరిపై ఒకరు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.

ఇది కూడా చదవండి: స్నేహం ముసుగులో ఇంత మోసమా? పాపం ఆట సందీప్!

ఇది కూడా చదవండి: పల్లవి ప్రశాంత్ గ్రేట్ అని ఒప్పేసుకున్న సెలబ్రిటీలు!

ఆ సమయంలో శోభాశెట్టి మాట్లాడుతూ.. ఆపోజిట్ టీమ్ అయిన మహాబలి వాళ్లే ఆ పని చేసుంటారు అని కామెంట్ చేస్తుంది. ఆ మాట వినగానే రతికా రోజ్ సీరియస్ అవుతుంది. సెన్స్ కొడుతుందేమో గానీ.. సెన్స్ లేకుండా మాట్లాడకు అంటుంది. ఆ మాటతో శోభాశెట్టి కూడా ఫైర్ అవుతుంది. నేను రతికా తీసుకుంది అని చెప్పానా? అని ప్రశ్నించింది. ఏమీ తెలియకుండా బ్లేమ్ చేయద్దు అంటూ రతికా సూచిస్తుంది. అయితే రితాకి తెలియని విషయం శోభాశెట్టి గెస్ చేసిందే కరెక్ట్. వాళ్ల టీమ్ వాళ్లే ఆ పవరాస్త్రాన్ని దొంగిలించారు. ఈ వాదన అప్పటికి ముగిసినట్లు కనిపించినా.. కచ్చితంగా అసలు విషయం తెలిసిన తర్వాత మళ్లీ రాజుకుంటుంది. శోభా శెట్టి వర్సెస్ రతికా రోజ్ ఎపిసోడ్ లోడ్ అవుతోంది. ఇద్దరూ తగ్గే వ్యక్తులు కాదు.

తన తప్పు ఉన్నా గట్టిగా మాట్లాడే వ్యక్తి రతికా.. ఎదురు ఉన్నది ఎవరైనా తగ్గకుండా మాట్లాడే వ్యక్తి శోభాశెట్టి. ఇంకేముంది.. ప్రేక్షకుల్లో పూనకాలు లోడ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు రతికా రోజ్ హౌస్ లో టేస్టీ తేజ, గౌతమ్ వంటి వాళ్లతో గొడవలకు దిగింది. వాటిలో రతికా రోజ్ పైచేయి సాధించినట్లు కనిపిస్తుంది. కానీ, ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. గొడవ జరిగితే.. ఎదురు శివాజీ ఉన్నా ఏ మాత్రం తగ్గకుండా మాట్లాడింది శోభాశెట్టి. అలాంటి రతికా రోజ్ తో గొడవ అంటే అస్సలు తగ్గే పరిస్థితే ఉండదు. పైగా శోభాశెట్టిని సెన్స్ లేకుండా మాట్లాడకు అంటూ రతిక కామెంట్ చేసింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం గట్టిగానే ఎదురుచూస్తున్నారు. మరి.. శోభశెట్టి వర్సెస్ రతికా రోజ్ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి