Nidhan
బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్గా నిలిచిన అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్గా నిలిచిన అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
తెలుగులో అత్యంత పాపులారిటీ సాధించిన రియాలిటీ షో అయిన బిగ్బాస్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఎప్పుడూ ఇంట్రెస్టింగే. గత కొన్ని వారాలుగా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తూ వస్తున్న ఈ షో ఫినాలే ఆదివారం జరిగింది. ఈసారి టైటిల్ కోసం చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ అమర్దీప్, పల్లవి ప్రశాంత్ మధ్యే తీవ్ర పోటీ కనిపించింది. వీళ్లిద్దరిలో ఒకరు విజేతగా నిలుస్తారని సోషల్ మీడియాలోనూ గట్టిగా వినిపించింది. ఎట్టకేలకు ఈ టైటిల్ను పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. తన గేమ్తో ఆడియెన్స్ మనసులు దోచుకొని బిగ్బాస్ సీజన్-7 విన్నర్గా నిలిచాడు. యూట్యూబర్గా, ఫోక్ సాంగ్స్ క్రియేటర్గా లైఫ్ను స్టార్ట్ చేసిన ప్రశాంత్ ఇప్పుడు బిగ్బాస్ విజేతగా నిలిచాడు. మరోవైపు ఆఖరి వరకు మంచి కాంపిటీషన్ ఇచ్చిన సీరియల్ యాక్టర్ అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. అయితే ఈ ఇద్దరి అభిమానులు గొడవ పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బిగ్బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్ దగ్గరకు అమర్దీప్, ప్రశాంత్ అభిమానులు భారీగా తరలివచ్చారు. రైతుబిడ్డ విజేత అని తెలియగానే అతడి ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో ప్రశాంత్-అమర్ అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా చినికి గాలివానలా మారింది. ఇద్దరి అభిమానులు ఒకర్నొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో తిట్టుకున్నారు. అదే టైమ్లో అటు వైపుగా వెళ్తున్న కొండాపూర్-సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సు మీదా దాడి చేసి, దాని అద్దాన్ని పగులగొట్టారు. మరోవైపు బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్దీప్ వాహనాన్ని కొందరు చుట్టుముట్టారు. ఆ వెహికిల్ను ముందుకు కదలనీయకుండా అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. కారు అద్దాలు పగులగొట్టి అమర్దీప్ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు.
కారు అద్దాలు పగులగొట్టి అమర్దీప్ను బయటకు దిగమని అనడంతో అతడి తల్లి, భార్య భయపడ్డారు. అయితే దీని గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్కు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. సెక్యూరిటీ మధ్య వారిని అక్కడి నుంచి తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్తో పాటు అమర్దీప్ అభిమానుల చర్యల మీద నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. గేమ్ను గేమ్గా చూడాలని ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. రన్నరప్ అమర్ కారుపై దాడి చేసి అతడి ఫ్యామిలీని భయాందోళనలకు గురిచేయడం సరికాదని అంటున్నారు. మరి.. ఈ దాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. OTT సీజన్ 2 పై ప్రకటన!
Fans of #PallaviPrashanth and #Amardeep fight outside Annapurna 7 Acres. Front glass of an RTC Bus has also been broken.#BiggBossTelugu7 pic.twitter.com/DxPxQDwop1
— Gulte (@GulteOfficial) December 17, 2023