iDreamPost

Bigg Boss 7 Telugu: బిగ్​బాస్ విన్నర్, రన్నరప్ అభిమానుల మధ్య గొడవ.. RTC బస్సులో..!

  • Published Dec 18, 2023 | 8:00 AMUpdated Dec 18, 2023 | 8:57 AM

బిగ్​బాస్ విన్నర్​ పల్లవి ప్రశాంత్, రన్నరప్​గా నిలిచిన అమర్​దీప్ అభిమానుల మధ్య గొడవ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

బిగ్​బాస్ విన్నర్​ పల్లవి ప్రశాంత్, రన్నరప్​గా నిలిచిన అమర్​దీప్ అభిమానుల మధ్య గొడవ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 18, 2023 | 8:00 AMUpdated Dec 18, 2023 | 8:57 AM
Bigg Boss 7 Telugu: బిగ్​బాస్ విన్నర్, రన్నరప్ అభిమానుల మధ్య గొడవ.. RTC బస్సులో..!

తెలుగులో అత్యంత పాపులారిటీ సాధించిన రియాలిటీ షో అయిన బిగ్​బాస్​లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఎప్పుడూ ఇంట్రెస్టింగే. గత కొన్ని వారాలుగా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తూ వస్తున్న ఈ షో ఫినాలే ఆదివారం జరిగింది. ఈసారి టైటిల్​ కోసం చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ అమర్​దీప్, పల్లవి ప్రశాంత్ మధ్యే తీవ్ర పోటీ కనిపించింది. వీళ్లిద్దరిలో ఒకరు విజేతగా నిలుస్తారని సోషల్ మీడియాలోనూ గట్టిగా వినిపించింది. ఎట్టకేలకు ఈ టైటిల్​ను పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. తన గేమ్​తో ఆడియెన్స్ మనసులు దోచుకొని బిగ్​బాస్ సీజన్-7 విన్నర్​గా నిలిచాడు. యూట్యూబర్​గా, ఫోక్ సాంగ్స్ క్రియేటర్​గా లైఫ్​ను స్టార్ట్ చేసిన ప్రశాంత్ ఇప్పుడు బిగ్​బాస్ విజేతగా నిలిచాడు. మరోవైపు ఆఖరి వరకు మంచి కాంపిటీషన్ ఇచ్చిన సీరియల్ యాక్టర్ అమర్​దీప్ రన్నరప్​గా నిలిచాడు. అయితే ఈ ఇద్దరి అభిమానులు గొడవ పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బిగ్​బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్​ దగ్గరకు అమర్​దీప్, ప్రశాంత్ అభిమానులు భారీగా తరలివచ్చారు. రైతుబిడ్డ విజేత అని తెలియగానే అతడి ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో ప్రశాంత్-అమర్ అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా చినికి గాలివానలా మారింది. ఇద్దరి అభిమానులు ఒకర్నొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో తిట్టుకున్నారు. అదే టైమ్​లో అటు వైపుగా వెళ్తున్న కొండాపూర్-సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సు మీదా దాడి చేసి, దాని అద్దాన్ని పగులగొట్టారు. మరోవైపు బిగ్​బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్​దీప్ వాహనాన్ని కొందరు చుట్టుముట్టారు. ఆ వెహికిల్​ను ముందుకు కదలనీయకుండా అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. కారు అద్దాలు పగులగొట్టి అమర్​దీప్​ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు.

కారు అద్దాలు పగులగొట్టి అమర్​దీప్​ను బయటకు దిగమని అనడంతో అతడి తల్లి, భార్య భయపడ్డారు. అయితే దీని గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్​కు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. సెక్యూరిటీ మధ్య వారిని అక్కడి నుంచి తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్​తో పాటు అమర్​దీప్ అభిమానుల చర్యల మీద నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. గేమ్​ను గేమ్​గా చూడాలని ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. రన్నరప్ అమర్​ కారుపై దాడి చేసి అతడి ఫ్యామిలీని భయాందోళనలకు గురిచేయడం సరికాదని అంటున్నారు. మరి.. ఈ దాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బిగ్ బాస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. OTT సీజన్ 2 పై ప్రకటన!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి