iDreamPost

Bigg Boss 7 Telugu: మళ్లీ అదే తప్పు.. బకరా చేసినా భజన చేస్తున్నాడు!

Bigg Boss 7 Telugu: మళ్లీ అదే తప్పు.. బకరా చేసినా భజన చేస్తున్నాడు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మూడో వారం ఆట మొదలైపోయింది. రెండోవారం షకీలా ఎలిమినేట్ అయ్యాక హౌస్ మొత్తం ఎమోషనల్ అయింది. అదే ఎమోషన్ సోమవారం ఎపిసోడ్ లో చూశాం. యావర్ వేసిన నామినేషన్ వల్ల షకీలా ఎలిమినేట్ అయింది. ఇంక హౌస్ లో సోమవారం అనగానే నామినషన్స్ ఉంటాయి. రెండోవారంతో పోలిస్తే.. ఈ వీక్ నామినేషన్స్ లో అంత డ్రామా, గొడవలు జరగలేదనే చెప్పాలి. ధామిని- ప్రిన్స్, తేజ- ప్రశాంత్, శుభశ్రీ- రతికల మధ్య మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగాయి. ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. శుభశ్రీ, గౌతమ్, ప్రియాంక జైన్, అమర్ దీప్, రతిక, ధామిని, యావర్ ఉన్నారు. మొదట నామినేషన్స్ లో టేస్టీ తేజ ఉండగా.. అతడిని సందీప్, శివాజీ సేవ్ చేసి.. అమర్ దీప్ ని నామినేట్ చేశారు.

నామినేషన్స్ తర్వాత హౌస్ లో ఆట ఇంట్రస్టింగ్ గా మారింది. అందరూ ఎవరి గ్రూపు సభ్యులతో వాళ్లు మాట్లాడటం మొదలు పెట్టారు. అలాగే కొందరు నామినేట్ అయినందుకు బాధతో కూర్చుకున్నారు. వారిలో రతిక కూడా ఉంది. హౌస్ లో ఆమె డల్ గా కూర్చోవడంతో హౌస్ మేట్ శివాజీ వెళ్లి ఆమెతో మాట్లాడతాడు. ఆమె ఎందుకో బాధగా ఉందని చెబుతుంది. అందుకు శివాజీ నాకు చెప్తే నేను ఏదైనా చెప్తా కదా అంటూ ఆమెను చీర్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయినా ఆమె డల్ గానే ఉంటుంది. ఆ తర్వాత లాన్ లో కూర్చుని ఉంటుంది. ఆమె పక్కన పల్లవి ప్రశాంత్, శివాజీ ఉంటారు. రతికా ఏడుస్తూ ఉండగా.. ప్రశాంత్ ఆమెను నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఏంటి నీ కళ్ల నుంచి పాలు వస్తున్నాయి. కళ్లల్లో పాల సముద్రం దాచావా? అంటూ డైలాగులు కొడతాడు.

మరోవైపు ప్రిన్స్ యావర్ ఆమెను నవ్వించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఇద్దరూ కలిసి చివరకు రతికాను నవ్విస్తారు. అయితే ఈ విషయంలో ప్రశాంత్ పై నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఎందుకంటే అతని విషయంలో రతిక చేసింది చాలా పెద్ద తప్పు. అన్నీ తెలిసి ఊరుకుని.. చివర్లో అతడినే దోషిని చేసి మాట్లాడింది. అందుకు ప్రశాంత్ కూడా హౌస్ లో సీరియస్ గా ఉన్నాడు. రతికాకు కౌంటర్లు కూడా ఇచ్చాడు. అయితే అది అంతా కేవలం రెండ్రోజుల్లో ముగిసిపోయింది. మళ్లీ ఆమె చుట్టూ తిరగడం ప్రారంభించాడు. ఆమెకు వకాల్తా తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఎందుకు అంటే రతికాతో గొడవ పడ్డాడు అని.. ఈ వీక్ తేజాని నామినేట్ చేశాడు. అసలు రతికాతో గొడవ పడితే ప్రశాంత్ కి ఏం అవసరం? అలా ఎందుకు తేజాని నామినేట్ చేశాడు? అనే ప్రశ్నలు రాకుండా మానవు. అతని విషయంలో చేసింది అంతా మర్చిపోయే ఇప్పుడు మళ్లీ రతికాని నవ్విస్తూ కూర్చున్నాడు.

ఇదంతా చూస్తుంటే ప్రశాంత్ తన గేమ్ గాలికి వదిలేశాడు అనే ఫీలింగ్ కలుగుతోంది. ఎందుకు అంటే హౌస్ లో ఎవరి ఆట వారిది.. పైగా అతడిని అంత మోసం చేస్తే.. మళ్లీ ఆమెను నవ్విస్తూ ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పాయింట్ అయితే ప్రేక్షకులకు అస్సలు నచ్చదు. అయితే ఇదంతా అతను ఎంతో గొప్పవాడు అనింపించుకోవడానికి చేసినా కూడా.. అది సింపథీ గేమ్ కిందకు కన్వర్ట్ అవుతుంది. కాబట్టి పల్లవి ప్రశాంత్ తన సొంత గేమ్ ఆడుకుంటే చాలా బాగుంటుంది. హౌస్ లో నామినేషన్స్ సహజం.. గొడవలు సహజం.. వాటిని చూసి ప్రశాంత్- రతికా రోజ్ కు సపోర్ట్ వెళ్తే.. అది అతనికే బ్యాక్ ఫైర్ అవుతుంది. కాబట్టి ప్రశాంత్ సొంత గేమ్ ఆడుకోవడం మంచిది. పల్లవి ప్రశాంత్ మరోసారి రతికాకు దగ్గర కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి