iDreamPost

ప్రజా ప్రతినిధులకు కరోనా ముప్పు- ఆ ఎమ్మెల్యేతో పాటు మరో నలుగురికి కూడా పాజిటివ్

ప్రజా ప్రతినిధులకు కరోనా ముప్పు- ఆ ఎమ్మెల్యేతో పాటు మరో నలుగురికి కూడా పాజిటివ్

కరోనా ఇప్పుడు ప్రజా ప్రతినిధులకు కూడా సోకుతుంది. తమిళనాడు ఎమ్మెల్యే అన్బళగన్ కరోనా వైరస్ సోకడం వల్ల చనిపోవడం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద కుదుపుగా చెప్పుకోవచ్చు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకినట్లుగా నిర్దారణ కావడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.

ఎమ్మెల్యేతో పాటుగా ఆయన ఇంట్లో మరో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటుగా ఆయన భార్య, గన్‌మెన్, వంటమనిషి, డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పేషీలోని అటెండర్‌, కారు డ్రైవర్‌కు కరోనా సోకడంతో హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు రెండోసారి వైరస్‌ నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. కరోనా పరీక్షల్లో మేయర్‌కు నెగెటివ్ గా నిర్దారణ అయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి