iDreamPost

బేగంపేట్ మర్డర్ కేసు.. సీసీ టీవీ ఫుటేజ్ లో భయంకర దృశ్యాలు

  • Published Apr 03, 2024 | 9:53 PMUpdated Apr 03, 2024 | 9:53 PM

హైదరాబాద్, బేగంపేట్ లో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

హైదరాబాద్, బేగంపేట్ లో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

  • Published Apr 03, 2024 | 9:53 PMUpdated Apr 03, 2024 | 9:53 PM
బేగంపేట్ మర్డర్ కేసు.. సీసీ టీవీ ఫుటేజ్ లో భయంకర దృశ్యాలు

సమాజంలో నేర ప్రవృత్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా సరే.. నేరాలను అరికట్టడంలో విఫలమవుతూనే ఉన్నారు అధికారులు. అసలు మనుషుల్లో మంచి, జాలి, దయ, మానవత్వం వంటి గుణాలు అడుగంటిపోతున్నాయి. కావాలని చేస్తున్నారో.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదు కానీ.. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా హైదారాబాద్ లో దారుణం చోటు చేసుకుంది.

హైదరాబాద్, బేగంపేట్ లో మంగళవారం రాత్రి సమయంలో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. నలుగురు యువకులు.. ఓ కుర్రాడి మీద విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సదరు యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. బేగంపేట్, రసూల్పుర, అంబేడ్కర్ నగర్ లో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. అంబేడ్కర్ నగర్ లో నివాసం ఉంటున్న తరుణ్ అనే యువకుడిపై కొందరు తీవ్రంగా దాడి చేశారు.

మంగళవారం రాత్రి నలుగురు యువకులు బైక్ మీద తరుణ్ ఇంటి వద్దకు వచ్చారు. ఇక అందరూ చూస్తుండగానే.. తరుణ్ మీద తీవ్రంగా దాడి చేశారు దుండగులు. అతడిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తరుణ్ ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. అతడు మార్గమాధ్యలోనే కన్ను మూశాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అందరి ముందే యువకుడిపై దాడి చేయగా.. ఒక్కరు కూడా అడ్డగించకపోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి