iDreamPost

భర్తతో స్నేహంగా ఉంటోంద‌ని, నలుగురు యువకులతో మ‌హిళ‌ను అత్యాచారం చేయించిన భార్య‌

భర్తతో స్నేహంగా ఉంటోంద‌ని, నలుగురు యువకులతో మ‌హిళ‌ను అత్యాచారం చేయించిన భార్య‌

హైదరాబాద్ కొండాపూర్ లో గాయత్రి అనే మహిళ ఓ యువతిపై పథకం ప్రకారం నలుగురు యువకులతో దాడి చేయించి, అత్యాచారం కూడా చేయించింది. ఈ సంఘటన బయటకి రావడంతో సంచలనంగా మారింది. శ్రీకాంత్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కొండాపూర్ లో ఉంటున్నాడు. బాధితురాలు కూడా కొండాపూర్‌లోని అదే కాలనిలో వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. వీరిద్దరూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది.

వీరి స్నేహంతో అప్పుడప్పుడు ఆ బాధితురాలు శ్రీకాంత్ ఇంటికి కూడా వచ్చేది. శ్రీకాంత్ భార్య గాయత్రితో కూడా మంచిగా ఉండేది. కొన్ని నెలల క్రితం గాయత్రి తన ఆరోగ్యం బాగోలేదని ఆ యువతిని తన ఇంట్లో కొన్ని రోజులు ఉండమని అడిగింది. దీనికి ఆ యువతి సహాయం చేద్దామని ఉండటానికి ఓకే చెప్పింది. ఇంట్లో ఉన్న రోజుల్లో గాయత్రికి తన భర్త శ్రీకాంత్‌, ఆ యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో వారి మధ్య గొడవలు అయ్యాయి. ఈ వ్యవహారంపై ఇటీవల ఏప్రిల్‌ 24న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసి కొన్ని రోజులకే కేసును విత్‌డ్రా చేసుకుంది.

ఆ తర్వాత యువతిని మాట్లాడాలని ఇంటికి పిలిచింది. కాసేపు మాట్లాడిన తర్వాత పథకం ప్రకారం ఆ యువతిని గదిలోకి తీసుకెళ్లి అప్పటికే అక్కడ ఉన్న కిరాయికి మాట్లాడుకున్న నలుగురు యువకులతో దాడి చేయించింది. యువతి నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా హింసించిన ఆ యువకులు తర్వాత ఆమెపై లైంగికదాడికి కూడా పాల్పడ్డారు. ఈ ఘాతుకాన్ని నిందితురాలు గాయత్రి తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియో సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించింది.

తీవ్రంగా గాయపడిన ఆ యువతిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి గాయత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాయత్రితో పాటు, నలుగురు యువకులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి