iDreamPost

యువతి ఆత్మహత్య ఘటనలో ఊహించని ట్విస్ట్! అసలేం విషయం ఏంటంటే?

యువతి ఆత్మహత్య ఘటనలో ఊహించని ట్విస్ట్! అసలేం విషయం ఏంటంటే?

ఇటీవల జోగులాంబ గద్వాల్ జిల్లాలో సునంద అనే యువతి ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ అమ్మాయి కడుపు నొప్పి భరించలేకే ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకున్నారు. కానీ, ఆమె ఆత్మహత్యకు కడుపు నొప్పి సమస్య కాదని, ఆమె ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేకే సునంద ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అందరూ షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. జోగులాంబ గ్వాల్ జిల్లా ధరూర్ మండల కేంద్రానికి చెందిన సునంద (23) అనే యువతి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. అయితే, ఇటీవల సొంతూరుకి వచ్చిన సునంద ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. దీంతో కడుపు నొప్పి భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడిందని అందరినీ నమ్మించారు. కానీ, ఆ యువతి కడుపు నొప్పి సమస్యతో ఆత్మహత్య చేసుకోలేదని, ప్రియుడు మోసం చేసిన కారణంగానే బలవన్మరణానికి పాల్పడిందని తెలుస్తుంది.

ఇక ఈ విషయం బయటకు రాకుండా గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టించి మృతురాలి బంధువులకు రూ.9 లక్షలు కూడా చెల్లించినట్లు తెలుస్తుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో యువతి కుటుంబానికి న్యాయం చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆ యువతి ఆత్మహత్య కేసులో ఇంత జరిగిందా అని మృతురాలి మరి కొందరు బంధువులు షాక్ గురయ్యారు. ఇంతేకాకుండా ఆందోళనకు కూడా సిద్దమవుతున్నారట. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి