iDreamPost

సామూహిక వివాహాల్లో ఒక్కటైన 12 వేల జంటలు.. వధువుల ఖాతాల్లో రూ.35 వేలు

సామూహిక వివాహాల్లో ఒక్కటైన 12 వేల జంటలు.. వధువుల ఖాతాల్లో రూ.35 వేలు

ఉత్తరప్రదేశ్ లో జరిగిన సామూహిక వివాహాల్లో 12 వేల జంటలు ఒక్కటయ్యాయి. యూపీలోని 60 జిల్లాల్లో జరిగిన ఈ పెళ్ళిళ్ల ద్వారా వేల జంటలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాయి. కుల, మతాలకు అతీతంగా జరిగిన ఈ వివాహాల్లో ఒక్కో వధువు ఖాతాలో రూ.35 వేల చొప్పున జమచేసింది యూపీ ప్రభుత్వం. లక్నోలో జరిగిన ఈ వివాహ వేడుకలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్ పాల్గొని.. నవ జంటలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చేయూతనివ్వడంతో పాటు వరకట్నం అనే దురాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రెండో విడత సామూహిక వివాహాలు ఈనెల 17న నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి