iDreamPost

‘నేను విన్నాను.. నేనున్నాను..’ అంటూ యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్!

  • Author ajaykrishna Published - 12:37 PM, Sat - 8 July 23
  • Author ajaykrishna Published - 12:37 PM, Sat - 8 July 23
‘నేను విన్నాను.. నేనున్నాను..’ అంటూ యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్!

తెలుగు రాష్ట్రాల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితాన్ని చూపిస్తూ 2019లో యాత్ర అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా.. మంచి విజయం సాధించింది. ఆ మూవీని తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్.. యాత్ర 2 ఉంటుందని అప్పట్లోనే ప్రకటించాడు. అయితే.. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత రీసెంట్ గా యాత్ర 2 మూవీకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. అందులోనూ పోస్టర్ లో.. ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుని’ అని కనిపించిన లైన్స్ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాయి.

ఇక ఈరోజు అంటే.. జులై 8న వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా.. యాత్ర 2 మూవీ నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఎన్నికల ప్రచారంలో వైఎస్ చెప్పిన మాటలు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ వీడియో మొదలైంది. ‘నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా నమస్తే నమస్తే’ అంటూ ఆ రోజుల్లో వైఎస్ మాట్లాడిన మాటలను మరోసారి గుర్తు చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ఎంట్రీ.. నేనెవరో ప్రపంచానికి తెలియకపోవచ్చు.. కానీ, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని.. అని జగన్ క్యారెక్టర్ చెప్పాక.. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అనే మాటలతో వీడియో ఎండ్ అయింది.

ఈ సినిమాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర.. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు.. అనంతరం ముఖ్యమంత్రి పీఠం.. ప్రమాణ స్వీకారం.. ఇలాంటి అంశాలన్నీ ఇందులో చూపించ బోతున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తుండగా.. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. ఇక వైఎస్ జగన్ క్యారెక్టర్ లో తమిళ హీరో జీవా నటించనున్నట్లు సమాచారం. ఈ విషయంపై మూవీ టీమ్ నుండి, డైరెక్టర్ మహి రాఘవ్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. మరి వైఎస్ జగన్ బయోపిక్ గా వస్తున్న యాత్ర 2 పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి