iDreamPost

ప్రియుడితో కలసి స్మృతి మంధాన ఫోజులు.. యూత్ హార్ట్ బ్రేక్ చేసింది!

  • Published Mar 18, 2024 | 12:38 PMUpdated Mar 18, 2024 | 12:41 PM

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ విన్నర్​గా నిలిచింది ఆర్సీబీ. అయితే విక్టరీ తర్వాత ఆ టీమ్ కెప్టెన్ స్మృతి మంధాన తన ప్రియుడితో కలసి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె బాయ్​ఫ్రెండ్​ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు ఫ్యాన్స్.

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ విన్నర్​గా నిలిచింది ఆర్సీబీ. అయితే విక్టరీ తర్వాత ఆ టీమ్ కెప్టెన్ స్మృతి మంధాన తన ప్రియుడితో కలసి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె బాయ్​ఫ్రెండ్​ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు ఫ్యాన్స్.

  • Published Mar 18, 2024 | 12:38 PMUpdated Mar 18, 2024 | 12:41 PM
ప్రియుడితో కలసి స్మృతి మంధాన ఫోజులు.. యూత్ హార్ట్ బ్రేక్ చేసింది!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డ్రీమ్ నెరవేరింది. అందని ద్రాక్షగా ఉన్న ట్రోఫీని ఆ జట్టు పట్టేసింది. పురుషుల జట్టు వల్ల కానిది.. మహిళలు సాధించి చూపించారు. 16 ఏళ్లుగా ఐపీఎల్​లో ట్రోఫీ కొట్టడంలో మెన్స్ టీమ్ ఫెయిలవుతూ వస్తోంది. అయితే మహిళల జట్టు మాత్రం రెండో సీజన్​నలోనే కప్పు కలను నిజం చేసుకుంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 విజేతగా ఆర్సీబీ నిలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన టైటిల్ ఫైట్​లో స్మృతి సేన 8 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది. ఆర్సీబీకి ఫస్ట్ టైటిల్ దక్కడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ తరుణంలో యూత్ హార్ట్​ను బ్రేక్ చేస్తూ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన తన ప్రియుడితో కలసి ఫోజులు ఇచ్చింది. మరి.. ఆమె బాయ్​ఫ్రెండ్ ఎవరు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్​లో నెగ్గగానే బెంగళూరు ప్లేయర్స్ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. స్టేడియంలోని ఆర్సీబీ అభిమానులతో పాటు టీవీలు, మొబైల్స్​లో మ్యాచ్​ను చూస్తున్న ఫ్యాన్స్ కూడా సంబురాల్లో మునిగిపోయారు. ఆ టైమ్​లో మ్యాచ్​కు ఆతిథ్యం ఇచ్చిన అరుణ్ జైట్లీ మైదానంలో బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన బాయ్​ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ సందడి చేశాడు. మ్యాచ్ జరుగుతున్న టైమ్​లో స్మృతికి సపోర్ట్ చేసిన అతడు.. ట్రోఫీ నెగ్గాక మంధానతో కలసి ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. స్మృతి-పలాష్ కలసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్సీబీ మాజీ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ కూడా తన ఇన్​స్టాగ్రామ్ స్టోరీలో పలాష్-స్మృతి ఫొటోలను షేర్ చేశాడు. దీంతో అసలు పలాష్ ఎవరు? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు.

పలాష్​తో కలసి స్మృతి ఫొటోలు దిగడం, వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం తెలియడంతో ఆమెను ఆరాధించే అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. అయితే బాయ్​ఫ్రెండ్​తో కలసి మంధాన ఫొటోలు దిగడం ఇదే తొలిసారి కాదు. 2023లో చైనాలోని హాంగ్​జూలో జరిగిన ఏషియా గేమ్స్​లో భారత విమెన్స్ టీమ్ గోల్డ్ మెడల్ నెగ్గినప్పుడు కూడా పలాష్ అక్కడికి విచ్చేశాడు. దీంతో అతడితో కలసి స్మృతి ఫొటోలు దిగింది. కాగా, స్మృతి-పలాష్ చాన్నాళ్లుగా డేటింగ్​లో ఉన్నారని తెలుస్తోంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్​గా మంచి ఫాలోయింగ్ ఉన్న పలాష్​కు ఒక ఈవెంట్​లో మంధానతో పరిచయం ఏర్పడిందట. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్తా ఆ తర్వాత ప్రేమగా మారిందని క్రికెట్ వర్గాల సమాచారం. ‘ముసాఫిర్’, ‘భీగే యాదే’, ‘కినారా’, ‘సితారో మే’, ‘కరమ్ కర్దే’ లాంటి హిట్ సాంగ్స్​తో సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు పలాష్ ముచ్చల్. మరి.. పలాష్-స్మృతి ప్రేమాయణంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: RCBని దారుణంగా ట్రోల్‌ చేసిన రాజస్థాన్‌! దిమ్మతిరిగే కౌంటరిచ్చిన RCB ఫ్యాన్స్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి