iDreamPost

వ‌రుడు న‌ల్ల‌గా ఉన్నాడ‌ని, పెళ్లి మ‌ధ్యలో వ‌ధువు…

వ‌రుడు న‌ల్ల‌గా ఉన్నాడ‌ని, పెళ్లి మ‌ధ్యలో వ‌ధువు…

ఈ పెళ్లిలో అన్నీ ట్విస్ట్ లే. పెళ్లి మొద‌లైంది. పూజారి మంత్రాలు చ‌దువుతున్నాడు… వధువు నీతా యాదవ్ ఆపండి అని అరిచింది. అంద‌రూ అదిరిప‌డ్డారు. ఈ పెళ్లి వ‌ద్ద‌ని చెప్పింది. కారణం మ‌రీ షాకింగ్. వరుడు న‌ల్ల‌గా ఉన్నాడంట‌.

ఈ సంఘటన గురువారం, రవి యాదవ్‌తో నీతా యాదవ్ వివాహం జరగడానికి ముందు రోజు, యూపీ, ఇటావాలోని భర్తానా టౌన్ లో జ‌రిగింది,

పెళ్లి వేడుక మొద‌లైన వెంట‌నే దంపతులు దండలు మార్చుకున్నారు. అక్క‌డ నుంచే అన్ని స‌మ‌స్య‌లు మొద‌లైయ్యాయి, అప్పుడే నీతు హఠాత్తుగా పెళ్లి వ‌ద్ద‌నుకుంది.

పెళ్లిచూపుల్లో చూసిన కుర్రాడు ఈ వ‌రుడు ఒక్కడు కాద‌ని చెప్పింది. అదేంటి అని అడిగితే, అప్పుడు కాస్త కాస్త తెల్ల‌గా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం న‌ల్ల‌గా ఉన్నాడు. కాబ‌ట్టి నాకు వ‌ద్ద‌ని తేల్చేసింది. క‌ల‌ర్ బాగాలేద‌ని ఎవ‌రైనా పెళ్లిని ఆపుకొంటారా అని పేరెంట్స్ చెప్పినా, నీతా ఒప్పుకోలేదు.

వధువును ఒప్పించేందుకు ఆరు గంటలకు పైగా వ‌రుడు ట్రైచేశాడు. ఆమె విన‌లేదు. అందుకే బారాత్, పెళ్లిలేకుండానే వ‌రుడు ఇంటికివెళ్లిపోయాడు. ఇలా పెళ్లి కాన్సిల్ అయ్యింది.

అయితే, వధువుకు కానుకగా ఇచ్చిన వేల రూపాయల విలువైన నగలు తమకు తిరిగి ఇవ్వలేదని, వరుడి తండ్రి, పోలీస్ స్టేష‌న్ లో కేసుపెట్టాడు. ఇది ఇంకో ట్విస్ట్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి