iDreamPost

పెళ్లైన తెల్లారే బిడ్డకు జన్మమనిచ్చిన నవవధువు.. షాక్‌లో బంధువులు!

  • Published Jun 30, 2023 | 2:56 PMUpdated Jun 30, 2023 | 2:56 PM
  • Published Jun 30, 2023 | 2:56 PMUpdated Jun 30, 2023 | 2:56 PM
పెళ్లైన తెల్లారే బిడ్డకు జన్మమనిచ్చిన నవవధువు.. షాక్‌లో బంధువులు!

సాధారణంగా ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వాలంటే 9 నెలలకు పైగా సమయం పడుతుంది. ప్రీమెచ్యూర్‌ బేబీస్‌లో అయితే నెలలు నిండకుండానే డెలివరీ అవుతుంది. సరే ఎంత లేదన్నా ఓ బిడ్డకు జన్మనివ్వాలంటే.. ఏడు నెలల సమయం అయినా పడుతుంది. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబేయే సంఘటన మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. పెళ్లైన మరసటి రోజే.. బిడ్డకు జన్మనిచ్చింది ఓ నవ వధువు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిన వధువు.. కడుపు నొప్పి అనడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. గర్భవతి అని తేల్చారు. పైగా అవి పురిటి నొప్పులని.. తెలిపారు. ఇలా ఉండగానే.. సదరు నవ వధువు బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త తెలిసి బంధువులే కాదు.. చుట్టుపక్కల వారు కూడా షాకయ్యారు. అసలు ఇలా సాధ్య పడుతుంది.. అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. మరి ఇంతకు ఈ వింత సంఘటన ఎలా జరిగింది అంటే…

ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీ, గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన యువకుడికి.. తెలంగాణ, సికింద్రాబాద్‌కు చెందిన యువతితో కొన్ని రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. ఇక ఈ నెల 26,సోమవారం నాడు.. సికింద్రాబాద్‌లో ఘనంగా వీరి వివాహం వేడుక జరిపించారు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత.. నూతన వధూవరులు.. యూపీలోని పెళ్లి కుమారుడు ఇంటికి బయలు దేరారు. మరుసటి రోజు.. అనగా మంగళవారం వధువుకు ఉన్నట్లుండి కడుపు నొప్పి వచ్చింది.

విషయం తెలిసిన వెంటనే అత్తింటి వారు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ నవ వధువుని పరీక్షించిన వైద్యులు.. ఓ షాకింగ్‌ విషయం వెల్లడించారు. కొత్త పెళ్లి కుమార్తె గర్భవతి అని తెలిపారు. విషయం తెలుసుకున్న అత్తింటి వారు.. వైద్యులు అన్న మాట విని షాక్‌తో బిగుసుకుపోయారు. నిన్న పెళ్లైతే.. మరుసటి రోజే ఆమె గర్భవతి కావడం ఏంటి అని ఆశ్చర్యపోయారు. అంతేకాక నవ వధువు అప్పటికే ఏడు నెలల గర్భవతి అని చెప్పారు. అదే రోజు ఆ నవవధువు ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

అయితే ఆ వధువు గర్భవతి అనే విషయం ఆమె తల్లిదండ్రులకు తెలుసు. అన్ని తెలిసే.. ఆ విషయాన్ని దాచి.. ఏమి తెలినట్లుగా వివాహం జరిపించారు. పెళ్లి చూపుల సమయంలో వధువు కడుపు పెద్దగా ఉండటం గమనించిన.. వరుడు, అతడి కుటుంబ సభ్యులు.. దీని గురించి వధువు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. అందుకు వధువు తల్లిదండ్రులు.. ఆమెకు ఇటీవల కడుపులో రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ జరిగిందని.. అందుకే అమ్మాయి పొట్ట కాస్త లావుగా ఉందని బుకాయించారు.

అత్తారింటికి వెళ్లిన నవ వధువు అక్కడ ఆడ బిడ్డకు జన్మనిచ్చిందనే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే వారు వారు సికింద్రాబాద్‌ నుంచి గ్రేటర్ నోయిడాకు చేరుకున్నారు. ఈ ఘటనపై రెండు కుటుంబాలు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే వరుడు అతని తల్లిదండ్రులు.. పుట్టిన బిడ్డను అంగీకరించకపోవడంతో వధువు కుటుంబం.. శిశువును, ఆమెను.. వారి వెంట తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తమకు సమాచారం మాత్రమే అందిందని.. ఎవరూ దానిపై కేసు గానీ ఫిర్యాదు గానీ చేయలేదని దన్‌కౌర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి