iDreamPost

వీడియో: ప్రేమను తిరస్కరించిందని.. దారుణం! వీడు మనిషేనా?

ఇటీవల దేశంలో ఆడవాళ్లపై ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్భయ, దిశ చట్టాలు ఉన్నా.. కామాంధులు ఒంటరిగా మహిళలు కనిపిస్తే రెచ్చిపోతున్నారు.

ఇటీవల దేశంలో ఆడవాళ్లపై ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్భయ, దిశ చట్టాలు ఉన్నా.. కామాంధులు ఒంటరిగా మహిళలు కనిపిస్తే రెచ్చిపోతున్నారు.

వీడియో: ప్రేమను తిరస్కరించిందని.. దారుణం! వీడు మనిషేనా?

ఈ మద్య మహిళపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. లైంగిక వేధింపులు, అత్యాచారలు, హత్యల పరంపర కొనసాగుతుంది. చిన్నా పేద్ద అనే వయసు తో సంబంధం లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. కొంతమంది యువతులకు మాయమాటలు చెప్పి డేటింగ్ పేరుతో మోసం చేస్తూ.. అవసరం తీరిన తర్వాత చంపేస్తున్నారు. తమ ప్రేమను కాదన్నందుకు పగపట్టి హతమారుస్తున్నారు. ఇలాంటి కేసులు దేశంలో నిత్యం పదుల సంఖ్యలో ఎక్కడో అక్కడ నమోదు అవుతూనే ఉన్నాయి. తన ప్రేమను కాదన్నందుకు ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జైపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని కారుతో గుద్ది చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జైపూర్‌లో జావాద్‌కు సమీపంలోని ఖతిఖేడా గ్రామానికి చెందిన ఉమా సుతార్ అనే యువతిని కారుతో గుద్ది చంపాడు మంగేష్ అరోరా. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీముచ్ జిల్లాకు చెందిన ఉమా సుతార్ జైపూర్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా పనిచేస్తుంది. ఆమె తండ్రి మోతీలాల్ సుతార్, తల్లి మంజు బాయి. తమ గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ఉమ చదువుకుంది.. ఈ క్రమంలోనే జైపూర్ లో ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తుంది. మంగేష్ అనే యువకుడు ఉమాను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధించసాగాడు. ఈ క్రమంలోనే ఉమా సతార్ తో ఉన్న రాజ్ కుమార్ తో గొడవ జరిగింది. తన ప్రేమను కాదన్న కోపంతో మంగేష్ కారుతో ఉమా సుతార్ తో పాటు రాజ్ కుమార్ అనే వ్యక్తిని అతివేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఉమా సుతార్ అక్కడే మరణించగా.. రాజ్ కుమార్ కీ తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ఘటన జైపూర్ లోని జవహార్ సర్కిల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని గిర్దార్ లో ఉన్న హూటల్ ముందు జరిగినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నింధితుడు పరారీలో ఉన్నాడని.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు ఫైల్ చేశామని అన్నారు. ఇదిలా ఉంటే.. నింధితుడు మంగేష్ కి పలువురు గ్యాంగ్ స్టర్స్ తో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జైపూర్ క్లబ్ లో కాల్పుట ఘటన జరిగింది.. దీని గురించి పోలీసులు మంగేష్ ని కూడా ప్రశ్నించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నింధితుడు మంగేష్ హర్యానాలోని మనేసర్ లో నివసిస్తున్నాడు..ఇతరికి ఒక రెస్టారెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రేమ పేరుతో నిండు జీవితాన్ని బలితీసుకున్న మంగేష్ కి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి