నా కూతుర్ని ఏమైనా అంటే చంపేస్తా! వైరలవుతున్న రాకేష్ మాస్టర్ చివరి సెల్ఫీ వీడియో!

నా కూతుర్ని ఏమైనా అంటే చంపేస్తా! వైరలవుతున్న రాకేష్ మాస్టర్ చివరి సెల్ఫీ వీడియో!

  • Author Soma Sekhar Published - 03:00 PM, Tue - 27 June 23
  • Author Soma Sekhar Published - 03:00 PM, Tue - 27 June 23
నా కూతుర్ని ఏమైనా అంటే చంపేస్తా! వైరలవుతున్న రాకేష్ మాస్టర్ చివరి సెల్ఫీ వీడియో!

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల చేత ఆయన కన్నుమూశారు. దాదాపు 1500 సినిమాలకు పైగా ఆయన కొరిగ్రఫీ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వారితో కూడా రాకేష్ మాస్టర్ వర్క్ చేశారు. ప్రస్తుతం రాకేష్ మాస్టర్ చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో తాను నిర్వహించిన బలే బాసు షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ల గురించి మాట్లాడాడు. ఇక తన కూతరి జోలికి వస్తే నరికేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంట్లో తనను చీటింగ్ చేసిన వారి గురించి చెప్పుకొచ్చాడు. ఇక తాను నిర్వహించిన రియాలిటీ షోలో వ్యక్తుల గురించి వివరించాడు. కాగా.. ఈ మధ్య కొన్ని షోలు ఒప్పుకున్నానని, వాటి గురించి త్వరలోనే చెప్తానని తెలిపారు. ఇక బలే బాసు షోలో చాలా చీటింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు రాకేష్ మాస్టర్.

ఇక ఓ రోజు రాత్రి ఉప్పల్ బాలు, మరో వ్యక్తి ఓ వ్యక్తిని తీసుకొచ్చిన నా పక్కన కూర్చోబెట్టారని, దాంతో నేను వారిపై కోప్పడ్డట్లుగా పేర్కొన్నారు. ఇక వైజాగ్ సత్య, అగ్గిపెట్టె మచ్చ కన్నింగ్ చేశారని, ఉప్పల్ బాలు మంచోడని రాకేష్ మాస్టర్ ఈ వీడియోలో తెలిపారు. ఓ మహిళ నా కుటుంబాన్ని మెుత్తం తిట్టిందని, అయినా గానీ నేను ఆమెను ఏమీ అనలేదని వివరించారు. నా కూతురు జోలికి వస్తే నరికేస్తా అని వారికి వార్నింగ్ ఇచ్చారు రాకేష్ మాస్టర్. ప్రస్తుతం రాకేష్ మాస్టర్ చివరి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show comments