Shahid Afridi Conversation With Suresh Raina: రైనాకు సారీ చెప్పిన అఫ్రిదీ.. కావాలని చేయలేదంటూ..!

రైనాకు సారీ చెప్పిన అఫ్రిదీ.. కావాలని చేయలేదంటూ..!

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు పాక్ మాజీ ఆల్​రౌండర్ షాహిద్ అఫ్రిదీ క్షమాపణలు చెప్పాడు. కావాలని చేయలేదంటూ.. ఏం జరిగిందో వివరణ ఇచ్చాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు పాక్ మాజీ ఆల్​రౌండర్ షాహిద్ అఫ్రిదీ క్షమాపణలు చెప్పాడు. కావాలని చేయలేదంటూ.. ఏం జరిగిందో వివరణ ఇచ్చాడు.

సురేష్ రైనా, షాహిద్ అఫ్రిదీ.. క్రికెట్​లో ఎప్పుడూ గుర్తుండిపోయే ఆటగాళ్లలో వీళ్లు తప్పక ఉంటారు. రైనా తన లెఫ్టాండ్ బ్యాటింగ్​తో, అద్భుతమైన ఫీల్డింగ్​తో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అవసరమైన సమయంలో స్పిన్ బౌలింగ్​తోనూ బ్రేక్ త్రూలు అందించాడు. వన్డే వరల్డ్ కప్-2011ను భారత్ ఒడిసి పట్టడంలో అతడికి కీలకపాత్ర. అటు అఫ్రిదీని చూసుకుంటే క్రికెట్​కు పాక్ అందించిన అత్యుత్తమ ఆల్​రౌండర్లలో ఒకడిగా పేరు గడించాడు. లెగ్ స్పిన్​ బౌలింగ్, పించ్ హిట్టింగ్​తో దాయాది జట్టుకు ఒంటిచేత్తో ఎన్నో విక్టరీలు అందించాడు. అఫ్రిదీ-రైనా ఫీల్డ్​లో శత్రువులుగా ఉండేవారు. కానీ వీళ్ల మధ్య మంచి స్నేహమే ఉంది. అయితే ఇప్పుడు ఓ ఫ్యాన్ కారణంగా వీళ్ల నడుమ వివాదం చెలరేగింది.

పాకిస్థాన్ అభిమానుల గురించి తెలిసిందే. తమ జట్టే తోపు, తమ ఆటగాళ్లే గ్రేట్ అంటూ అనవసర బిల్డప్ ఇస్తుంటారు. ఇలాగే ఓ పాక్ ఫ్యాన్ అఫ్రిదీని గ్రేట్ అంటూ.. రైనాను రెచ్చగొట్టాడు. టీ20 వరల్డ్ కప్-2024కు బ్రాండ్ అంబాసిడర్​గా అఫ్రిదీని నియమించిన నేపథ్యంలో రైనా చూశావా అంటూ ఆ అభిమాని టీజ్ చేశాడు. దీనికి టీమిండియా లెజెండ్ స్ట్రాంగ్​ కౌంటర్ ఇచ్చాడు. తాను ఐసీసీ అంబాసిడర్​ను కాకపోవచ్చునని.. కానీ వన్డే వరల్డ్ కప్-2011 గెలిచిన భారత జట్టులో సభ్యుడినని అన్నాడు. మొహాలీ మ్యాచ్ గుర్తుందా.. అది చూడు మర్చిపోలేని జ్ఞాపకాలు గుర్తుకొస్తాయంటూ పంచ్ ఇచ్చాడు. ఆ ఏడాది మెగా టోర్నీలో మొహాలీ వేదికగా జరిగిన సెకండ్ సెమీ ఫైనల్​లో పాక్​ను 29 రన్స్ తేడాతో భారత్ చిత్తు చేసింది. అందుకే ఆ మ్యాచ్​ను గుర్తుచేస్తూ కౌంటర్ ఇచ్చాడు రైనా.

రైనాను పాక్ ఫ్యాన్ రెచ్చగొట్టడం, అతడు దిమ్మతిరిగే రిప్లై ఇవ్వడం వైరల్​గా మారింది. ఈ విషయం అటు ఇటు తిరిగి అఫ్రిదీ దగ్గరకు వచ్చింది. దీన్ని తెలుసుకున్న అతడు రైనాకు వెంటనే కాల్ చేశాడట. అతడికి సారీ చెప్పి.. కావాలని చేసింది కాదని వివరణ ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా అఫ్రిదీనే చెప్పాడు. ‘రైనా నాకు సోదరుడి లాంటోడు. అసలు ఏం జరిగిందనేది మొత్తం అతడికి వివరించా. దీంతో వివాదాస్పద ట్వీట్​ను తొలగించేందుకు రైనా ఒప్పుకున్నాడు’ అని అఫ్రిదీ తెలిపాడు. ఈ విషయం తెలిసిన భారత ఫ్యాన్స్.. మళ్లీ ఇండియన్స్​తో పెట్టుకోవద్దని కామెంట్స్ చేస్తున్నారు. తమతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్ కప్-2024కు అఫ్రిదీతో పాటు టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ కూడా అంబాసిడర్​గా ఎంపికయ్యాడు. మరి.. రైనా-అఫ్రిదీ వివాదంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments