IND vs BAN: రెండో టెస్ట్‌ జరిగే కాన్పూర్‌ పిచ్‌ ఎలా ఉంటుంది? ఎవరికి అనుకూలం? పూర్తి వివరాలు..

IND vs BAN, Kanpur Pitch Report: ఫస్ట్ టెస్ట్​లో బంగ్లాదేశ్​ను చిత్తుగా ఓడించిన భారత్.. రెండో ఛాలెంజ్​కు రెడీ అవుతోంది. కాన్పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్​లోనూ ప్రత్యర్థిని చిత్తు చేసి సిరీస్​ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

IND vs BAN, Kanpur Pitch Report: ఫస్ట్ టెస్ట్​లో బంగ్లాదేశ్​ను చిత్తుగా ఓడించిన భారత్.. రెండో ఛాలెంజ్​కు రెడీ అవుతోంది. కాన్పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్​లోనూ ప్రత్యర్థిని చిత్తు చేసి సిరీస్​ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

ఓడించి తీరతామంటూ తమను రెచ్చగొట్టిన బంగ్లాదేశ్ బెండు తీసింది భారత్. రెండు టెస్టుల సిరీస్​లో భాగంగా జరిగిన తొలి టెస్ట్​లో ఆ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. ఏకంగా 280 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. మళ్లీ మనతో పెట్టుకోవాలంటే భయపడేలా చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలోనూ రోహిత్ సేన ముందు నిలబడలేకపోయింది బంగ్లాదేశ్. ఈ గెలుపును ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు రెండో టెస్ట్​పై ఫోకస్​ను షిఫ్ట్ చేశారు. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27వ తేదీన మొదలవనుందీ మ్యాచ్. దీంతో ఈ పిచ్ ఎలా ఉంటుంది? చెన్నై వికెట్​లాగే ఉంటుందా? మార్పులు చేస్తారా? ఎవరికి అనుకూలం? లాంటి డిస్కషన్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కాన్పూర్ పిచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బంగ్లాదేశ్​కు షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్పిన్ ఫ్రెండ్లీగా ఉన్న చెన్నై వికెట్​ను పేస్ పిచ్​గా మార్చారు. అందుకు తగ్గట్లే ఆ టెస్ట్​లో తొలి రెండ్రోజులు పేస్ బౌలింగ్​కు చక్కటి హెల్ప్ దొరికింది. అయితే కాన్పూర్​లో మాత్రం స్లో వికెట్​ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. పూర్తిగా నల్లమట్టితో వికెట్​ను తయారు చేస్తున్నారని సమాచారం. కాస్త ఫ్లాట్​గా ఉండే ఈ ట్రాక్ మీద మొదట్లో పరుగులు ఈజీగా వచ్చినా.. ఆ తర్వాత స్పిన్ డామినేషన్ మొదలవుతుందట. స్పిన్నర్లు పండుగ చేసుకునేలా ఈ ట్రాక్​ను రూపొందిస్తున్నారని వినిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలని డిసైడ్ అయిందట. లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్​లో కేవలం ఒకే మార్పు జరగనుందని తెలుస్తోంది.

చెన్నై టెస్ట్​లో ఆడిన పేసర్ ఆకాశ్​దీప్​కు బదులు చైనామన్ కుల్దీప్ యాదవ్​ను కాన్పూర్ టెస్ట్​లో బరిలోకి దింపనున్నారని సమాచారం. ఇప్పటికే అతడికి ఈ మాట చెప్పి, తీవ్రంగా ప్రాక్టీస్ చేయిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ పిచ్​తో టీమిండియాకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఒకవేళ స్పిన్ వికెట్​ అయితే భారత్ డేంజర్​లో పడుతుంది. ఎందుకంటే షకీబ్ అల్ హసన్, మెహ్దీ హసన్ మిరాజ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్లతో బంగ్లా టీమ్​ బలంగా ఉంది. మరోవైపు స్పిన్​ను ఎదుర్కోవడంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీకి ఉన్న ఇబ్బందులు ఇంకా పోలేదు.

రోహిత్ శర్మ తప్పితే స్పిన్​ను ఫేస్ చేయడంలో దాదాపుగా అందరు బ్యాటర్లు స్ట్రగుల్ అవడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాన్పూర్​లో బంగ్లా విసిరే సవాల్​కు మనోళ్లు ఎలా అడ్డు నిలుస్తారో చూడాలి. ఇక, కాన్పూర్ గ్రౌండ్ విషయానికొస్తే.. ఇక్కడ ఓవరాల్​గా 23 టెస్టులు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ 7 సార్లు నెగ్గింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 370గా ఉంది. దీన్ని బట్టి లోస్కోరింగ్ గేమ్​గా కనిపిస్తోంది. స్పిన్​ను సమర్థంగా ఎదుర్కొన్న టీమ్​ గెలుపు పక్కాగా కనిపిస్తోంది. బ్యాటర్ల టెక్నిక్, పేషెన్స్​కు ఈ మ్యాచ్ రియల్ టెస్ట్​గా నిలవబోతున్నట్లు అనిపిస్తోంది.

Show comments