చిత్రపరిశ్రమలో విషాదం.. ‘ఆదిపురుష్’ నటి కన్నుమూత!

Adipurush actress Asha Sharma passed away: భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి ఆశా శర్మ 88 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచింది.

Adipurush actress Asha Sharma passed away: భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి ఆశా శర్మ 88 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచింది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు కారణాలతో కొందరు నటీ, నటులు మరణించిన సంఘటనలు మరిచిపోకముందే.. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి ఆశా శర్మ(88) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. అయితే ఆమె మృతికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటి అయిన ఆశా శర్మ(88) ఆదివారం తుదిశ్వాస విడిచింది. చాలా సంవత్సరాలుగా టీవీ, షోలు చేస్తూ.. ప్రేక్షకులకు దగ్గరైంది. ధర్మేంద్ర, హేమామాలిని నటించిన ‘దో దిశాయీన్’ మూవీలో ఆశా శర్మ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక తల్లి, అమ్మమ్మ పాత్రలతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. వెండితెరపై మఝేకుచ్ కెహనా హై, ప్యార్ తో హీనా హో థా, హమ్ తుమ్హారే హై సనమ్ లాంటి సీరియల్స్ లో నటించి పేరు తెచ్చుకుంది. చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇక చివరి సారిగా ప్రభాస్, కృతిసనన్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీలో ఆశా శర్మ నటించింది. ఆమె మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Show comments