iDreamPost

Surekha Vani: తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్న సురేఖ వాణి

  • Published Jan 08, 2024 | 5:20 PMUpdated Jan 08, 2024 | 5:25 PM

టాలీవుడ్ సీనియర్‌ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి అందరికి తెలిసిందే. ఒక నటిగా సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంత గుర్తింపు తెచ్చుకుందే సోషల్ మీడియాలో కూడా అంతే పాపులారీటి తెచ్చుకుంది. అయితే నిత్యం తన గ్లామరెస్ ఫోటోలతో దర్శనమిచ్చే సురేఖ వాణి తాజాగా తిరుమలలో కనిపించిన తీరు పై నెటిజన్స్ షాక్ గురైయ్యారు. అసలు తిరుమలలో సురేఖ వాణి ఎలా ఉందంటే..

టాలీవుడ్ సీనియర్‌ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి అందరికి తెలిసిందే. ఒక నటిగా సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంత గుర్తింపు తెచ్చుకుందే సోషల్ మీడియాలో కూడా అంతే పాపులారీటి తెచ్చుకుంది. అయితే నిత్యం తన గ్లామరెస్ ఫోటోలతో దర్శనమిచ్చే సురేఖ వాణి తాజాగా తిరుమలలో కనిపించిన తీరు పై నెటిజన్స్ షాక్ గురైయ్యారు. అసలు తిరుమలలో సురేఖ వాణి ఎలా ఉందంటే..

  • Published Jan 08, 2024 | 5:20 PMUpdated Jan 08, 2024 | 5:25 PM
Surekha Vani: తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్న సురేఖ వాణి

టాలీవుడ్ సీనియర్‌ నటి సురేఖ వాణి గురించి అందరికి తెలిసిందే. ఈమె సినీ ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకున్నారు. అలాగే సురేఖ తెలుగు సినిమాల్లో దాదాపు స్టార్ హీరో, హీరోయిన్ లకు అక్కగా, అమ్మగా, వదిన పాత్రల్లో పోషిస్తూ తనకంటు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే ఈ మధ్య ఆమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దీంతో ఆమె వెండితెర మీద కనిపించి చాలాకాలం అయింది. కాగా, ఆవకాశాల పరంగా జోరు తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఒక రకంగా సురేఖ వాణికి యాక్టింగ్ కి వచ్చిన గుర్తింపు కంటే సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే ఎక్కువ అని చెప్పాలి. అంతలా తన గ్లామరెస్ ఫోటోలతో తరుచుగా సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంటుది. ఇదిలా ఉంటే.. తాజాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. అందులో సురేఖ వాణిని చూసిన నెటిజన్స్ షాక్ గురయ్యారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నటి సురేఖ వాణి తన కూతురు సుప్రితతో కలసి సోషల్ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అందం విషయంలో కూతురుతో పోటీ పడుతుందంటే ఆమె గ్లామర్‌ను ఏరకంగా మెయిన్‌టైన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే నిత్యం గ్లామరస్ గా కనిపించిన సురేఖ వాణి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకునుటకు సంప్రదాయంగా చీరకట్టులో మెరిసింది. అలాగే కాలినడకన తిరుమల చేరుకున్న ఆమె ఆ వెంకటెశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంది. ఈ క్రమంలోనే..ఆ శ్రీవారికి తలనీలాలు కూడా సమర్పించుకుంది. అయితే దర్శనానంతరం సురేఖవాణి గుండుతో కనిపించడంతో అక్కడ భక్తులంతా సురేఖ వాణి చూసి ఆశ్చర్య పోయారు. ఈ క్రమంలోనే అక్కడ ఫోటోలు అడిగినవారికి ఫోటోలు ఇచ్చి వారిని సంతోష పరిచారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ప్రస్తుతం 46 ఏళ్ల వయస్సులో ఉన్న సురేఖ వాణి సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోస్, రీల్స్, డ్యాన్సులతో బాగానే వైరల్ అవుతుంది. సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. దీంతో నెట్టింట వీరిద్దరికి ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే సోషల్ మీడియాలో వీరిద్దరి పై ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. మరి, నటి సురేఖ వాణి తిరుమలలో తలనీలాలు సమర్పించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి