iDreamPost

ఆఫ్ఘానిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందా? ఆ మ్యాచ్ చుట్టూ అనుమానాలు!

  • Published Feb 12, 2024 | 4:47 PMUpdated Feb 12, 2024 | 4:47 PM

క్రికెట్​లో పసికూన స్థాయి నుంచి టెస్ట్ నేషన్ స్థాయికి ఎదిగింది ఆఫ్ఘానిస్థాన్. ఇటీవల కాలంలో సంచలన విజయాలతో అందర్నీ ఇంప్రెస్ చేస్తోంది.

క్రికెట్​లో పసికూన స్థాయి నుంచి టెస్ట్ నేషన్ స్థాయికి ఎదిగింది ఆఫ్ఘానిస్థాన్. ఇటీవల కాలంలో సంచలన విజయాలతో అందర్నీ ఇంప్రెస్ చేస్తోంది.

  • Published Feb 12, 2024 | 4:47 PMUpdated Feb 12, 2024 | 4:47 PM
ఆఫ్ఘానిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందా? ఆ మ్యాచ్ చుట్టూ అనుమానాలు!

మ్యాచ్ ఫిక్సింగ్.. క్రికెట్​ను ఈ పెనుభూతం ఎన్నాళ్లుగానో పట్టి పీడిస్తోంది. జలగలా జెంటిల్మన్ గేమ్​ను వెంటాడుతోంది. దీని వల్ల కొందరు ఆటగాళ్ల కెరీర్ క్లోజ్ అయింది. ప్లేయర్లు పత్తా లేకుండా పోవడమే కాదు.. ఏకంగా జట్ల మీద బ్యాన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఫిక్సింగ్​ను నిర్మూలించడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎన్నో చర్యలు చేపడుతోంది. ఫిక్సింగ్ చేయాలంటూ ఎవరైనా కలసినా వెంటనే చెప్పాలని ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చింది. ఫిక్సింగ్​ను అరికట్టేందుకు ప్రతి మ్యాచ్​పై నిఘా కూడా వేస్తోంది. దీంతో చాలా మటుకు ఇది తగ్గిపోయింది. కానీ ఎక్కడో ఒక చోట ఫిక్సింగ్ ఆరోపణలు రావడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ టీమ్​పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఆ దేశమే ఆఫ్ఘానిస్థాన్. అసలు ఈ విషయంలో ఆఫ్ఘాన్ పేరు ఎందుకు వినిపిస్తుందో ఇప్పుడు చూద్దాం..

మూడు వన్డేల సిరీస్​లో భాగంగా ఆదివారం శ్రీలంకతో రెండో మ్యాచ్​లో తలపడింది ఆఫ్ఘాన్. అయితే ఈ మ్యాచ్​లో ఆ జట్టు 10 పరుగుల తేడాలో చివరి 8 వికెట్లను కోల్పోయింది. 308 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ టీమ్ 33.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో 2 వికెట్లకు 143 పరుగులతో పటిష్టంగా కనిపించింది. మ్యాచ్​లో మ్యాజిక్ ఖాయమని అంతా అనుకుంటున్న వేళ 5 ఓవర్ల గ్యాప్​లో చివరి 8 వికెట్లు కోల్పోయింది. 155 పరుగుల భారీ తేడాతో ఓడింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్​ను 2-0తో సొంతం చేసుకుంది లంక. అయితే ఈ మ్యాచ్ చుట్టూ వివాదం నెలకొంది.

విజయం దిశగా దూసుకెళ్తున్న ఆఫ్ఘానిస్థాన్ అంత చిత్తుగా ఓడటం.. 10 పరుగుల తేడాతో 2 వికెట్లు కోల్పోవడంతో ఆ టీమ్ ఫిక్సింగ్​కు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నేళ్ల కింద వరకు క్రికెట్​లో పసికూనగా ఉన్న ఆఫ్ఘాన్ తక్కువ వ్యవధిలో టెస్ట్ నేషన్​ స్థాయికి ఎదిగింది. గతేడాది భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్​లో ఇంగ్లండ్, పాకిస్థాన్ లాంటి బడా టీమ్స్​ను కంగుతినిపించింది. టైటిల్ ఛాంపియన్​గా నిలిచిన ఆస్ట్రేలియాను కూడా ఓడించినంత పని చేసింది. ఆ టోర్నీలో లంక మీద కూడా గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆఫ్ఘాన్. అలాంటి టీమ్ ప్రస్తుత సిరీస్​లో వరుస మ్యాచుల్లో ఓడిపోవడం, రెండో వన్డేలో 10 పరుగుల గ్యాప్​లో ఏకంగా 8 వికెట్లు కోల్పోవడంతో ఆ టీమ్​పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సెకండ్ వన్డేలో ఆఫ్ఘానిస్థాన్ ఫిక్సింగ్​కు పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ జట్టు బ్యాటర్లు చెత్త షాట్లు కొట్టి ఔటైన తీరు కూడా దీనికి ఊతమిస్తోందని తెలుస్తోంది. అయితే ఆ టీమ్ ఫ్యాన్స్ మాత్రం అలాంటిదేదీ లేదని.. ఆఫ్ఘాన్​ను అనుమానించొద్దని అంటున్నారు. అదో బ్యాడ్ డే అని.. క్రికెట్​లో ఇలా టీమ్స్ అనూహ్యంగా కుప్పకూలడం అప్పుడప్పుడూ జరిగేదేనని చెబుతున్నారు. అయితే ఈ వివాదంలో నిజానిజాలు ఏంటనేది కాలమే బయటపెట్టాలి. మరి.. ఆఫ్ఘాన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందంటూ వ్యక్తం అవుతున్న అనుమానాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ సీక్రెట్ చెబితే CSKలో నుంచి పీకేస్తారు! ధోని షాకింగ్ కామెంట్స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి