iDreamPost

డిప్రెషన్‌లో ఉన్నా.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. అందుకే గంజాయి : షణ్ముఖ్‌

  • Published Feb 25, 2024 | 11:39 AMUpdated Feb 25, 2024 | 12:20 PM

Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు గంజాయి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ వివరాలు..

Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు గంజాయి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ వివరాలు..

  • Published Feb 25, 2024 | 11:39 AMUpdated Feb 25, 2024 | 12:20 PM
డిప్రెషన్‌లో ఉన్నా.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. అందుకే గంజాయి : షణ్ముఖ్‌

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ సీజన్‌ 5 రన్నరప్‌ షణ్ముఖ్ జస్వంత్‌ను కొన్ని రోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్‌ అన్న సంపత్‌ మీద వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యప్తు చేయడానికి అతడి ఇంటికి వెళ్లిన పోలీసులుకు అక్కడ షణ్ముఖ్‌, అతడి సోదరుడు ఇద్దరు గంజాయి సేవిస్తూ పట్టుబడటంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నివాసంలో గంజాయి కూడా లభించింది. ఆతర్వాత పోలీసుల విచారణలో షణ్ముఖ్ గంజాయి సేవించాడని నిర్ధారణ అయ్యింది. దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పోలీసుల విచారణలో షణ్ముఖ్‌ సంచలన విషయాలు వెల్లడించాడు. తాను గత కొంత కాలం నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్నానని.. అందుకే గంజాయి తీసుకుంటున్నట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అంతేకాక డిప్రెషన్‌లో ఉన్నాను.. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానంటూ బోరున ఏడ్చాడు. గంజాయి తీసుకుంటూ.. అడ్డంగా దొరికిన షణ్ముఖ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్‌ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ మాములోడు కాదని ఎందరినో మోసం చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. తాజా పరిణామంతో అతడి చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. దాంతో అతను చాలా ఘనకార్యాలు చేసినట్లు తెలుస్తోంది. సంపాత్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.

దాంతో ఆమె సంపత్‌ మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతడిని అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన సమయంలోనే అన్నదమ్ములిద్దరూ గంజాయితొ దొరకడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో సంపత్ తన ఎంబీఏ సహచర విద్యార్థిని కూడా మోసం చేసినట్లు తెలుస్తోంది. 2016లో సంపత్ థిక్ షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టాలని సదరు యువతి వద్ద రూ.20 లక్షలు తీసుకున్నాడని.. కానీ ఆమెకు నెలకు 7 వేల రూపాయలు మాత్రమే ఇచ్చాడని తెలిసింది.

దాంతో సదరు యువతి.. తన డబ్బు మొత్తం ఇవ్వాలని సంపత్‌పై ఒత్తిడి తేవడంతో ఆమెని బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా బెదిరించడాని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి ఆరు రోజులు ఉందనగా.. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడట. అంతేకాక సంపత్ ముంబైలో ఓ యువతిని ఇప్పపటికే పెళ్లి చేసున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి