iDreamPost

రామ్ చరణ్ శంకర్ లు మొదలుపెట్టేశారు

రామ్ చరణ్ శంకర్ లు మొదలుపెట్టేశారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఇందాక అన్నపూర్ణ స్టూడియోస్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. రణ్వీర్ సింగ్ ప్రత్యేక అతిథిగా రాగా మెగాస్టార్ చిరంజీవి గౌరవ గెస్ట్ గా విచ్చేశారు. హీరోయిన్ కియారా అద్వానీ, శ్రీకాంత్ లతో పాటు కొందరు ఇతర తారాగణం కూడా ఇందులో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఎవరూ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడలేదు కానీ ఫోటో షూట్ ల వరకు కానిచ్చేసి సెలవు తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రావొచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయి కానీ అలాంటిదేమి జరగలేదు. శంకర్ రాజమౌళిలతో ఫోటోలు దిగేందుకు సెలబ్రిటీలు సైతం ఆసక్తి చూపించారు.

ఇవాళ ఉదయం నుంచే దీని తాలూకు ప్రీ లాంచింగ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫుల్ సూట్లలలో ఉన్న చరణ్, కియారా, సునీల్, జయరామ్, అంజలి తదితరులంతా గుంపుగా వస్తున్న పిక్ క్షణాల్లో రీచ్ అయిపోయింది. గత వారం రోజులుగా ట్విట్టర్ ని వేదికగా చేసుకుని అభిమానులు దీని గురించి గట్టి హంగామా చేశారు. తమ బ్యానర్ లో 50వ సినిమాగా దిల్ రాజు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. బడ్జెట్ ఎంతనే లెక్కలు బయటికి రాలేదు కానీ మునుపటి లాగా వందల కోట్లతో ఆలస్యమయ్యేలాగా ఉండదని మాత్రం అంటున్నారు. ముందు ముందు వివరాలు తెలుస్తాయి.

ఇవాళ ఉదయం నుంచే దీని తాలూకు ప్రీ లాంచింగ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫుల్ సూట్లలలో ఉన్న చరణ్, కియారా, సునీల్, జయరామ్, అంజలి తదితరులంతా గుంపుగా వస్తున్న పిక్ క్షణాల్లో రీచ్ అయిపోయింది. గత వారం రోజులుగా ట్విట్టర్ ని వేదికగా చేసుకుని అభిమానులు దీని గురించి గట్టి హంగామా చేశారు. తమ బ్యానర్ లో 50వ సినిమాగా దిల్ రాజు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. బడ్జెట్ ఎంతనే లెక్కలు బయటికి రాలేదు కానీ మునుపటి లాగా వందల కోట్లతో ఆలస్యమయ్యేలాగా ఉండదని మాత్రం అంటున్నారు. ముందు ముందు వివరాలు తెలుస్తాయి.

Also Read: విలక్షణ నటుడి అభిమానులకు విందే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి