iDreamPost

రెండు భాగాలుగా మహేశ్- రాజమౌళి మూవీ! కారణం ఇదే!

  • Author Soma Sekhar Published - 05:03 PM, Mon - 13 November 23

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు పార్టులుగా రానున్నట్లు తెలుస్తోంది. మరి జక్కన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు పార్టులుగా రానున్నట్లు తెలుస్తోంది. మరి జక్కన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 05:03 PM, Mon - 13 November 23
రెండు భాగాలుగా మహేశ్- రాజమౌళి మూవీ! కారణం ఇదే!

ఇండస్ట్రీలో కాంబినేషన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబోలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా.. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో రాని కాంబోలో మూవీ రాబోతున్న విషయం మనకు తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసి ఓ చిత్రం చేస్తున్న సంగతి విదితమే. అయితే ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో రాబోతోంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మకమైన సినిమా స్క్రిప్టు దాదాపు పూర్తైందని సమాచారం. ఇక ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరి ఈ సినిమా రెండు భాగాలుగా రావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

SS రాజమౌళి.. బాహుబలితో ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ కోటలను బద్దలు కొట్టాడు జక్కన్న. ఈ మూవీతో ఆస్కార్ అవార్డును దక్కించుకోవడమే కాకుండా.. తన పేరును హాలీవుడ్ ప్రేక్షకులు గట్టిగా గుర్తుపెట్టుకునేలా చేశాడు. దీంతో ఈ దర్శక ధీరుడు నుంచి ఏ ప్రాజెక్ట్ వస్తుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులు అదిరిపోయే న్యూస్ ను గతంలోనే చెప్పాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కించనున్నారు.

ఆఫ్రికా అడవుల నేపథ్యంలో, ఇండియానా జోన్స్ తరహా బ్యాక్ డ్రాప్ తో విజువల్ వండర్ గా జక్కన్న ఈ మూవీని తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు తగ్గట్లుగా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను సిద్దం చేస్తున్నారట. దాదాపు స్క్రిప్టు మెుత్తం పూర్తికావొచ్చిందని తెలుస్తోంది. కాగా.. ఈ సంవత్సరం చివరికల్లా ప్రీ ప్రొడక్షన్ పనులు మెుదలౌతాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినికిడి. వచ్చే ఏడాది తొలి భాగంలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకురావడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. బాహుబలిని ఇదే ఫార్ములాతో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఔరా అనిపించాడు.

ఇప్పుడు ఇదే పద్దతితో మహేశ్ తో సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడట జక్కన్న. ముందుగా బాహుబలిని ఒక పార్టు అనుకుంటే.. తరువాత దాన్ని రెండు పార్ట్ లుగా మలిచాడు. ప్రస్తుతం మహేశ్ సినిమాను కూడా ఇదే ఫార్మూలాతో ముందుకు తీసుకుపోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే జక్కన్న ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తున్నాడట.  అదీకాక మహేశ్ లాంటి హీరోని ఒకే భాగంలో అనుకున్నట్లుగా చూపెట్టడం సాధ్యం అయ్యేపనికాదు. ఇక హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించే ఈ చిత్రం షూటింగ్ కనీసం నాలుగైదు ఏళ్లు పడుతుందని తెలుస్తోంది. మరి జక్కన్న-మహేశ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి