iDreamPost

Prabhas Sreenu: రూ.31 లక్షలు ఇవ్వమని అసిస్టెంట్ బ్లాక్​మెయిల్ చేస్తున్నాడు: ప్రభాస్ శ్రీను

  • Published Mar 14, 2024 | 8:17 PMUpdated Mar 14, 2024 | 8:17 PM

టాలీవుడ్​లో ఈతరం కమెడియన్స్​లో మంచి పేరు సంపాదించుకున్న వారిలో ప్రభాస్ శ్రీను ఒకరు. డిఫరెంట్ యాక్టింగ్​తో అందరి అభిమానాన్ని చూరగొన్నారాయన. అయితే అలాంటి నటుడ్ని డబ్బులు ఇవ్వమంటూ అసిస్టెంట్ బ్లాక్​మెయిల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్​లో ఈతరం కమెడియన్స్​లో మంచి పేరు సంపాదించుకున్న వారిలో ప్రభాస్ శ్రీను ఒకరు. డిఫరెంట్ యాక్టింగ్​తో అందరి అభిమానాన్ని చూరగొన్నారాయన. అయితే అలాంటి నటుడ్ని డబ్బులు ఇవ్వమంటూ అసిస్టెంట్ బ్లాక్​మెయిల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

  • Published Mar 14, 2024 | 8:17 PMUpdated Mar 14, 2024 | 8:17 PM
Prabhas Sreenu: రూ.31 లక్షలు ఇవ్వమని అసిస్టెంట్ బ్లాక్​మెయిల్ చేస్తున్నాడు: ప్రభాస్ శ్రీను

ఫిల్మ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ ఎక్స్​ప్రెషన్స్​తో కామెడీని పండించగల అతి తక్కువ ఆర్టిస్టుల్లో ప్రభాస్ శ్రీను ఒకరు. యాక్టర్​గానే గాక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​కు అసిస్టెంట్​గా, మంచి ఫ్రెండ్​గా ఉన్నారు. ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణంలో 300కు పైగా సినిమాల్లో మంచి కమెడియన్​గా గుర్తింపు పొందారు ప్రభాస్ శ్రీను. ప్రభాస్​ నటించే మూవీస్​కు సంబంధించిన పనులను చూసుకుంటూ బిజీగా ఉన్న ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. తన దగ్గర పని చేసిన ఓ అసిస్టెంట్ బ్లాక్​మెయిల్ చేస్తున్నాడని అన్నారు. ఎవరా అసిస్టెంట్? ఎందుకు ప్రభాస్ శ్రీనును బ్లాక్​మెయిల్ చేస్తున్నాడు? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పుడు తన దగ్గర పని చేసిన ఓ అసిస్టెంట్ ఫోర్జరీ చెక్స్ పెట్టి బ్లాక్​మెయిల్ చేస్తున్నాడని ప్రభాస్ శ్రీను తెలిపారు. లక్ష రూపాయల చెక్కు మీద ముందు 3ను యాడ్ చేసి.. 31 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్​మెయిల్ చేస్తున్నాడని చెప్పారు. ఇదే విషయంలో తన మీద కోర్టుకు కూడా వెళ్లాడని.. దీని గురించే పోలీసులను కలసి కేసు పెట్టానని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. 15 ఏళ్ల కింద తన దగ్గర అసిస్టెంట్​గా పని చేసిన వ్యక్తి చెక్స్​ను దుర్వినియోగం చేశాడని వ్యాఖ్యానించారు. తన కంప్లయింట్ చూసి దర్యాప్తునకు సీఐ ఒప్పుకున్నారని తెలిపారు. పదిహేనేళ్ల కిందటి చెక్​ను తీసుకొని అమౌంట్​ను పెంచి చూపించి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాగా, ప్రభాస్ శ్రీను నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఈ కేసులో దర్యాప్తును మొదలుపెట్టారని తెలిసింది.

ఈ కేసులో త్వరలోనే నిజానిజాలు ఏంటో బయటపడతాయి. అయితే తన దగ్గర పని చేసిన వ్యక్తి బ్లాక్​మెయిల్ చేస్తున్నాడంటూ ప్రభాస్ శ్రీను చెప్పడం వైరల్ అవుతోంది. ఇక, ప్రభాస్ నటిస్తున్న పలు ప్రాజెక్టుల గురించి ఇటీవల ప్రభాస్ శ్రీను చేసిన వ్యాఖ్యలు వాటి మీద ఎక్స్​పెక్టేషన్స్​ను మరింతగా పెంచేశాయి. ‘రాజా సాబ్’ పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్ అని.. ఈ మూవీ చాలా డిఫరెంట్​గా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను తెలిపారు. రెగ్యులర్ చిత్రాల్లా ఉండదని.. ఎప్పుడూ చూడని యాంగిల్స్ ఇందులో చూస్తారంటూ డార్లింగ్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశారు. మరి.. ప్రభాస్ శ్రీను-అసిస్టెంట్ కేసు విషయంలో మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి