iDreamPost

కొడుకు కోసం కలిసిన పవన్ – రేణు

కొడుకు కోసం కలిసిన పవన్ – రేణు

పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్ మళ్లీ కలిశారు. కొడుకు కోసం వీరిద్దరూ కలిశారు. అకీరా నందన్, ఆద్యలతో కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫొటో రేణు దేశాయ్ ఇన్ స్టా గ్రమ్ వేదికగా పోస్టు చేశారు. ఈ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ వేడుక జరిగింది. వీరిద్దరూ విడిపోయినా.. పిల్లల కోసం అకీరా గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కు వీరు హాజరయ్యారు. అకీరా నందన్, ఆద్యలిద్దరూ రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగే ఫంక్షన్ లకు అకీరా, ఆద్యలు హాజరవుతుంటారు. అకీరా నందన్ చదువుతున్న స్కూల్లో గ్రాడ్యుయేషన్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి రేణుతో పాటు పవన్ హాజరయ్యారు. అక్కడకు వచ్చిన పవన్ తో చాలా మంది ఫోటోలు దిగారు. పిల్లల కోసం తమ పంతాలను పక్కన పెట్టి ఈ వేడుకకు హాజరైనందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/Cd55ISEhnqq/?utm_source=ig_web_copy_link

‘బద్రి’ సినిమా సమయంలో కలిసిన వీరద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా నందన్‌, ఆద్యలు జన్మించారు. అకీరా నందన్‌ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ సందర్భంగా మళ్లీ వీరిద్దరూ కలవడం.. వేదికపై సందడి చేయడం పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ ఫ్యామిలీ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. స్కూల్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో అకీరా వాయిలెన్ వాయించడం విశేషం. ఇక పవన్ అటు రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ‘భవదీయుడుభగత్‌ సింగ్‌’ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి