iDreamPost

అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు

అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు

నర్సీపట్నం మునిసిపల్ కమీషనర్ కృష్ణవేణి తెలుగుదేశం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దుర్భాషలాడటమే కాకుండా తనను వివస్త్రను చేస్తాం అని బహిరంగంగా బెదిరింపులకు దిగినట్టు చెప్పుకొచ్చారు.

వివరాల్లోకి వెళితే నర్సీపట్నంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో  మునిసిపల్ కమీషనర్ ఆఫీసులో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తన తాతగారైన లట్చ పాత్రుడి ఫొటోని ఆఫీసు నుండి ఎందుకు తొలగించారంటు దురుసుగా ప్రవర్తించారు. కార్యాలయం మరమ్మత్తులు నిమిత్తం తీసి వేరే గదిలో భద్రపరిచాం అని మరమత్తులు పూర్తి అయ్యాక తిరిగి యథాస్థానంలో పెడతామని మునిసిపల్ కమీషనర్ కృష్ణవేణి వివరణ ఇచ్చినా శాంతించకుండా ఆ ఫోటో అక్కడ పెట్టకపొతే మిమ్మల్ని వివస్త్రను చేస్తాను అని విచక్షణ కోల్పొయి తీవ్రమైన వాఖ్యలు చేయడంతో కమీషనర్ తీవ్త్రంగా కలత చెందారు.

Also Read:యనమల, రాజప్పల అరెస్ట్ తప్పదా?

దీంతో కమీషనర్ కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మాజీ మంత్రిపై నిర్భయ కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. ఒక మాజీ మంత్రిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదవ్వడం ఇదే తొలిసారి అవ్వడం గమనార్హం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి