Idream media
Idream media
లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి సంస్థల (ఎంఎస్ఎంఈ)ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. ఆర్థిక ఇబ్బందులతో సకాలంలో రుణాలు చెల్లించలేని ఎంఎస్ఎంఈలకు ‘రుణాల ఏక కాల పునర్వ్యవస్థీకరణ’ (ఓటీఆర్) చేయడంలో ఆర్థికసాయం అందించే విధంగా రూపొందించిన ‘డాక్టర్ వైఎస్సార్ నవోదయం’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.
ఇది లబ్ది..
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 85 వేల యూనిట్లకు లబ్ధి చేకూరనుంది. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ఆదుకుంటామని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పథకం కోసం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ముగ్గురు లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ సర్టిఫికెట్లను అందజేశారు.