iDreamPost

బడా ప్రొడ్యూసర్​తో ముచ్చటగా మూడోసారి సినిమా చేయనున్న మోహన్​కృష్ణ ఇంద్రగంటి!

ఫీల్ గుడ్, సెన్సిబుల్ ఫిల్మ్స్ తీయడంలో టాలీవుడ్​లో దిట్టగా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు మోహన్​కృష్ణ ఇంద్రగంటి. ఆయన ఓ బడా ప్రొడ్యూసర్​తో కలసి ముచ్చటగా మూడోసారి సినిమా చేయనున్నారు.

ఫీల్ గుడ్, సెన్సిబుల్ ఫిల్మ్స్ తీయడంలో టాలీవుడ్​లో దిట్టగా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు మోహన్​కృష్ణ ఇంద్రగంటి. ఆయన ఓ బడా ప్రొడ్యూసర్​తో కలసి ముచ్చటగా మూడోసారి సినిమా చేయనున్నారు.

బడా ప్రొడ్యూసర్​తో ముచ్చటగా మూడోసారి సినిమా చేయనున్న మోహన్​కృష్ణ ఇంద్రగంటి!

టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత ‘యశోద’ సినిమాతో ప్రొడ్యూసర్​గా, లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్​తో బయోపిక్ ‘800’కి సమర్పకులుగా, శ్రీదేవి మూవీస్ పతాకంపై అద్భుతమైన చిత్రాలు అందించారు ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.‌ గతంలో మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్ కలయికలో వచ్చిన తొలి చిత్రం నాని ‘జెంటిల్​మన్’. ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించడంతో పాటు ప్రేక్షకుల దగ్గర మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సుధీర్ బాబు, అదితీ‌ రావు హైదరీ జంటగా ‘సమ్మోహనం’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ముచ్చటగా మూడోసారి ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కొత్త సినిమా చేయడానికి సిద్ధమయ్యారు ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్. ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వించే ప్రియదర్శి కథానాయకుడిగా నటించనున్నారు. ఇప్పటికే వరుస హిట్స్​తో పాటు హీరోగా ‘బలగం’తో భారీ విజయం అందుకున్నారు ప్రియదర్శి. ఆయనతో ఇంద్రగంటి తెరకెక్కించే మూవీ మార్చి నెలాఖరు నుంచి చిత్రీకరణ మొదలు కానుంది. ఈ ఫిల్మ్​కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి రానున్నాయి. మరి.. ఇంద్రగంటి-ప్రియదర్శి కాంబో సినిమా కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విమానంలో ఉన్న బ్యూటీ పాన్‌ ఇండియా హీరోయిన్‌.. ఎవరో తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి