iDreamPost

దేవర సినిమానుంచి బిగ్‌ అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పండగే..

దేవర సినిమానుంచి బిగ్‌ అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పండగే..

జూనియర్‌ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘దేవర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానుంచి తాజాగా బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఆ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఆ అప్‌డేట్‌ ఏంటంటే.. దేవర సినిమా 2 భాగాలుగా ఉండనుందట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు కొరటాల శివే చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇవ్వటానికి మీ ముందుకు వచ్చాను.

 సినిమా షూటింగ్‌ మొదలైన తర్వాత.. కథ విస్తృతి పెరుగుతూపోతోంది. చిత్రంలోని ప్రతీ పాత్రకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అందుకే కథను ఎంతో విస్తృతంగా.. వివరంగా తీయాలని భావిస్తున్నాము. ఒక భాగంలో దానికి న్యాయం చేయలేము.  ఈ పెద్ద కథను రెండు భాగాలుగా తీయాలని డిసైడ్‌ అయ్యాం. కథలో ఎలాంటి మార్పులు ఉండవు. భారీ తారాగణం ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఏప్రిల్‌ 5వ తేదీ కేవలం ప్రారంభం మాత్రమే’’ అని చెప్పుకొచ్చారు.

కాగా, దేవర సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. విలన్‌గా బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించి సముద్రం దగ్గర యాక్షన్‌ సీన్లను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కెమెరామ్యాన్‌ రత్నవేలు తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. ఇక, దేవర పార్ట్‌ 1.. 2024, ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, దేవర సినిమాను రెండు భాగాలుగా తీయటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి