iDreamPost

షార్క్ తో ఈత కొట్టిన “మల్లీశ్వరి”

షార్క్ తో ఈత కొట్టిన “మల్లీశ్వరి”

కత్రినా కైఫ్ వేల్ షార్క్ తో ఈత కొట్టి సందడి చేసింది.. “ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం” సందర్భంగా షార్క్ తో ఈత కొట్టిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో దాదాపు 29 లక్షల అభిమానులు ఆ వీడియోను వీక్షించారు. “నా ఆశ్చర్యకరమైన మిత్రుడితో సముద్రంలో ఓ అందమైన రోజు” అంటూ కత్రినా చేసిన వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

కాగా కత్రినాకైఫ్ తాజాగా నటించిన సూర్యవంశీ చిత్రం కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. తెలుగువారికి కూడా “మల్లీశ్వరి”గా పరిచయమైన ఈ సుందరి అల్లరిపిడుగు తర్వాత తెలుగు తెరపై నటించలేదు. అప్పట్లోనే మల్లీశ్వరి చిత్రంలో నటించడానికి కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరోయిన్ గా వార్తల్లో నిలిచింది. విజయ భాస్కర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన మల్లీశ్వరి చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి