iDreamPost

మా వాళ్లతో జాగ్రత్తగా ఆడండి.. టీమిండియాకు షోయబ్ అక్తర్ వార్నింగ్!

  • Author singhj Published - 07:37 PM, Sat - 9 September 23
  • Author singhj Published - 07:37 PM, Sat - 9 September 23
మా వాళ్లతో జాగ్రత్తగా ఆడండి.. టీమిండియాకు షోయబ్ అక్తర్ వార్నింగ్!

ఆసియా కప్​-2023లో మరో రసవత్తర పోరుకు అంతా సిద్ధమవుతోంది. గ్రూప్ దశలో తలపడిన భారత్-పాకిస్థాన్ జట్లు మరోమారు ముఖాముఖి మ్యాచ్​లో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. గ్రూప్ దశలో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్​లోనే దాయాది పాక్​తో తలపడింది. కానీ వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆ మ్యాచ్​ అసంపూర్తిగా ముగిసింది. ఆ మ్యాచ్​లో భారత బ్యాటింగ్ మాత్రమే సాధ్యమైంది. దీంతో దాయాదులు మళ్లీ తలపడితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ల కోరికను తీరుస్తూ సూపర్-4 దశలో కీలకమైన మ్యాచ్​ వచ్చేసింది.

భారత్, పాకిస్థాన్​ల మధ్య ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరగబోతోంది. టోర్నమెంట్​లో ముందు దశకు వెళ్లేందుకు రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. దీంతో విజయం కోసం రెండు టీమ్స్ చివరి వరకు పోరాడతాయి. పాక్​తో లీగ్ మ్యాచ్​లో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయొద్దని భారత్ భావిస్తోంది. షాహిన్ అఫ్రిది బౌలింగ్​ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొవాలని అనుకుంటోంది. ఒకవేళ అతడి బౌలింగ్​లో గనుక బాగా ఆడితే టీమిండియాకు ఎదురుండకపోవచ్చు. షాహిన్​తో పాటు మంచి ఫామ్​లో ఉన్న హ్యారీస్ రౌఫ్, నసీమ్ షాతో కూడా భారత్​కు ప్రమాదం పొంచి ఉంది.

బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ టీమిండియా మరింత మెరుగవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లీగ్ దశలో పాకిస్థాన్​తో మ్యాచ్​లో భారత బౌలర్లు బౌలింగ్ చేయలేదు. కానీ పసికూన నేపాల్​తో మ్యాచ్​లో మన బౌలర్లు బౌలింగ్ చేశారు. ఆ మ్యాచ్​లో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసినా.. 61 రన్స్ సమర్పించుకున్నాడు. ఒక్క జడేజా తప్ప ఎవరూ రాణించలేదు. ఈ నేపథ్యంలో పాక్​తో మ్యాచ్​లో బాగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. పాక్​తో మ్యాచ్​కు ముందు భారత్​కు హెచ్చరికలు పంపాడు షోయబ్ అక్తర్. టీమిండియా తమ జట్టు ఆటగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పాక్ లెజెండరీ పేసర్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్​ కోసం కొలంబోకు వెళ్లిన అక్తర్.. అక్కడ వాతావరణం బాగుందన్నాడు.

ఇదీ చదవండి: ఇది ఆరంభం మాత్రమే.. భారత్​కు షాహిన్ అఫ్రిది వార్నింగ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి