iDreamPost

ప్రియుడితో కలిసి ఓయో రూంకి వచ్చి.. చివరిలో షాకింగ్ ట్విస్ట్!

ఈ మధ్య విలాసాల కేంద్రాలుగా మారాయి ఓయో హోటల్స్. ఇక్కడ ప్రేమికులే కాదూ.. అక్రమ సంబంధాలు నడుపుతున్న జంటలు ఇక్కడ వాలిపోతున్నారు. తాజాగా

ఈ మధ్య విలాసాల కేంద్రాలుగా మారాయి ఓయో హోటల్స్. ఇక్కడ ప్రేమికులే కాదూ.. అక్రమ సంబంధాలు నడుపుతున్న జంటలు ఇక్కడ వాలిపోతున్నారు. తాజాగా

ప్రియుడితో కలిసి ఓయో రూంకి వచ్చి.. చివరిలో షాకింగ్ ట్విస్ట్!

లవర్స్ ఎంజాయ్ చేసే స్పాట్‌గా మారిపోయాయి ఓయో రూమ్స్. పెళ్లి కానీ యువతీ యువకులే కాదూ.. ఇల్లీగల్ కాంటాక్ట్ నడుపుతున్న పెళ్లైన జంటలు కూడా విహార యాత్రకు వచ్చినట్లు వస్తున్నారు ఇటీవల కాలంలో. దీంతో హోటల్స్ కామ క్రీడలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాయి. ప్రియుడి/ ప్రియురాలితో రాసలీలల్లో మునిగి తేలేందుకు ఇక్కడ వాలిపోతున్నారు. జీవిత భాగస్వామికి కళ్లు గప్పి.. పరాయి వ్యక్తితో భౌతిక ఆనందం కోసం ఓయో రూమ్స్‌కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చినన్నీ రోజులు ఇదే వారికి సరసాల కేంద్రం. ఇదే సమయంలో కొన్ని సార్లు అనుకోని ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ మహిళ ఓయో రూంలో శవమై తేలింది.

చత్తీస్‌గఢ్ రాయ్ పూర్‌లోని ఓయో హోటల్ రూంలో ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. గదిలోకి వెళ్లి చూడగా.. మృతదేహం చుట్టూ మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లను గమనించారు. ఆ మహిళ బీహార్ వాసి జోయా ఖాతూన్ (31) అని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 8న పారాలోని హోటల్ రిలాక్స్ (ఓయో హోటల్) తన స్నేహితుడితో కలిసి బస చేసింది జోయా. అయితే సోమవారం రాత్రి స్నేహితుడు బయటకు వెళ్లిపోయాడు. అయితే కొంత సేపటికి సిబ్బంది గదికి తలుపు కొట్టగా.. లోపలి నుండి లాక్ చేసి ఉంది. ఇక ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి.. గట్టిగా డోర్ కొట్టి.. తెరిచారు.

లోపలికి వెళ్లి చూడగా అచేతన స్థితిలో మహిళ పడి ఉంది. ఆమె నోటి నుండి రక్తం కారుతుండటంతో వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశాడు. ఈ సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. గది చూసి షాక్ అయ్యారు. హోటల్ సిబ్బందిని వివరాలు అడగ్గా.. ఓ వ్యక్తితో కలిసి.. ఆమె ఇక్కడకు వచ్చిందని, రాత్రంతా రూంలో ఎంజాయ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు నిర్దారించేలా.. మృతదేహం చుట్టూ.. మద్యం సీసాలు, సిగరెట్ ప్యాక్సెట్ కనిపించాయి. కాగా, జోయా స్నేహితుడిగా పేర్కొంటున్న వ్యక్తి కోల్ కత్తా వాసి అని తెలుస్తోంది. అతడు వెళ్లాక ఆమె బయటకు రాలేదని చెబుతున్నారు. ఆమె చనిపోయిన వార్తను కుటుంబ సభ్యులకు కూడా చేరవేశారు. మహిళ అక్కడకు ఎందుకు వచ్చిందో అన్న కోణంలో విచారిస్తున్నారు. అతిగా మద్యం సేవించడం వల్ల ఆమె మరణించి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి