iDreamPost

టిడిపి కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్: నోటీసు జారీ

టిడిపి కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్: నోటీసు జారీ

కరోనా వైరస్ (కోవిడ్-19) ఎఫెక్ట్ టిడిపి కార్యాలయానికి తాకింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రెవెన్యూ అధికారులు కరోనా వైరస్ (కోవిడ్‌-19) నోటీసు జారీ చేశారు. మహానాడు జరుగుతున్నందున కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరి తహసీల్దార్‌ పేరిట నోటీసు జారీ చేశారు. టిడిపి కార్యాలయ కార్యదర్శి రమణకు ఆత్మకూరు వీఆర్వో నోటీసు అందజేశారు.

రెండ్రోజుల పాటు టిడిపి కార్యాలయంలో మహానాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ అమలవుతున్న సందర్భంలో కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అందులో భాగంగానే నోటీసులు ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి