iDreamPost

క‌రోనా విజృంభ‌ణః 15 రాష్ట్రాల‌కు 50 కేంద్ర బృందాలుః ఆ 15 రాష్ట్రాలు ఏవంటే..?

క‌రోనా విజృంభ‌ణః 15 రాష్ట్రాల‌కు 50 కేంద్ర బృందాలుః ఆ 15 రాష్ట్రాలు ఏవంటే..?

దేశంలో క‌రోనా వైర‌స్ (కోవిడ్ -19) విజృంభిస్తోంది. రోజు రోజుకి వేల సంఖ్య‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు ప్ర‌మాద‌క‌రంగా మారాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా తీవ్రత బాగా ఎక్కువగా ఉండి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 జిల్లాలు, మున్సిపాలిటీలలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందాలను పంప‌నుంది. ఈ బృందాలలో బహుళ నైపుణ్యం ఉన్న వివిధ స్థాయి అధికారులుంటారు. కోవిడ్ -19 నియంత్రించటంలో అక్కడి ప్రభుత్వాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించటానికి ఈ బృందాలు కృషి చేస్తాయి.

ఇవే ఆ 15 రాష్ట్రాలు…

కేంద్ర ప్ర‌భుత్వం 15 రాష్ట్రాలకు కేంద్ర బృందాల‌ను పంప‌నుంది. మహారాష్ట్ర (7 జిల్లాలు, మున్సిపాలిటీలు), తెలంగాణ (4), తమిళనాడు (7), రాజస్థాన్ (5), అస్సాం(6), హర్యానా (4), గుజరాత్(3), కర్నాటక (4), ఉత్తరాఖండ్ (3), మధ్యప్రదేశ్(5), పశ్చిమ బెంగాల్(3), ఢిల్లీ (3), బీహార్ (4), ఉత్తరప్త్రదేశ్(4), ఒడిశా(5) త‌దిత‌ర రాష్ట్రాల్లో కేంద్ర బృందాల ప‌ర్య‌టించ‌నున్నాయి. ముగ్గురేసి సభ్యులతో కూడిన ఈ బృందాలలో ఇద్దరు ప్రజారోగ్య నిపుణులు/ అంటువ్యాధుల నిపుణులు/ వైద్యులు, ఒకరి పాలనాపరమైన విధులు నిర్వహించే జాయింట్ సెక్రెటరీ స్థాయి నోడల్ అధికారి అంటారు. ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ అక్కడి వ్యవహారాల మెరుగుదలకు కృషి చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాల వైద్య కేంద్రాలకు వెళ్ళి తగిన సహాయం అందించేందుకు, తద్వారా మెరుగైన చికిత్స అందటానికి, కోవిడ్ నియంత్రణకు, నివారణకు సాయపడతాయి.

మరింత మెరుగైన సమన్వయం సాధించటానికి, క్షేత్ర స్థాయిలో వేగవంతమైన చర్యలకు నిశితమైన వ్యూహాన్ని అనుసరించటానికి ఈ బృందాలు సహాయపడతాయి. పైన పేర్కొన్న జిల్లాలు/మున్సిపల్ కేంద్రాలు ఇప్పటికే రాష్ట్ర బృందాలతో అనుసంధానమై ఉన్న ఈ కేంద్రబృందాలతో సంప్రదింపులు జరుపుతూ ఉండటం వలన ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

కేంద్ర బృందాలు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం చేస్తూ పరీక్షల సంఖ్య విషయంలోను, అత్యధికంగా నమోదవుతున్న కేసుల విషయంలోను, అత్యధికంగా నిర్థారణ జరుగుతున్న నేపథ్యంలోను అక్కడి అధికారులు ఎదుర్కుంటున్న సవాళ్ళను పరిష్కరించే దిశలో కృషి చేస్తున్నాయి. వచ్చే రెండు నెలల కాలంలో వైద్య సదుపాయాప సామర్థ్యం తగినంతగా ఉందబోదనుకుంటున్న సమయంలో అక్కడ చేపట్టాల్సిన చర్యలను కూడా ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. పదకల కొరత, పెరుగుతున్న పాజిటివ్ నిర్థారణలు, మరణాల సంఖ్య, ఆకస్మికంగా కేసులు పెరగటం లాంటి సమస్యల విషయంలో తగిన చర్యలు తీసుకోవటానికి సహాయపడతాయి.

ఇప్ప‌టికే రాష్ట్రాలు అనేక జిల్లాలు, మున్సిపాలిటీలు ఇప్పటికే ప్రత్యేక బృందాల‌ను త‌మ తమ స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాయి. అందులో జిల్లా స్థాయి వైద్యాధికారులు, పాలనాధికారులు సభ్యులుగా ఉన్నారు. వారు ఎప్పటికప్పుడు కేంద్ర బృందాలతో సమాచారం పంచుకుంటూ తదుపరి చర్యలకు సలహాలు తీసుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి