iDreamPost

Hero: అభిమానుల గుండెల్లో చెరగని రూపం.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తున్నాడా!

  • Published Feb 09, 2024 | 11:55 AMUpdated Feb 09, 2024 | 11:55 AM

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం ఒక బుల్లితెర నటుడిగా కేరీర్ ప్రారంభించి స్టార్ హీరో గా ఎదిగినా ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం ఒక బుల్లితెర నటుడిగా కేరీర్ ప్రారంభించి స్టార్ హీరో గా ఎదిగినా ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.

  • Published Feb 09, 2024 | 11:55 AMUpdated Feb 09, 2024 | 11:55 AM
Hero: అభిమానుల గుండెల్లో చెరగని రూపం.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తున్నాడా!

సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ప్రశంసలతో పాటు విమర్శలు కూడా తీవ్ర స్థాయిలో వినిపిస్తాయి. ఇందులో నిలదక్కుకోవలంటే.. బ్యాగ్రౌండ్ అయిన లేదా టాలెంట్ అయిన ఉండాలి. అయితే చాలమంది హీరోలు మాత్రం ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. మరి అలాంటి వారిలో ఓ యాంగ్ హీరో ఒకరు ఉన్నారు. ఈ హీరో కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే.. తన సత్తా చాటాడానికి వెండితెర పై అడుగులు వేశాడు. అలా అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో విమర్శలను సైతం తన ఆద్భుతమైన నటనతో ప్రశంసలుగా అందుకున్నాడు. ఇలా ఎన్నో హిట్స్ ను అందుకొని అభిమానుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కానీ.. అకస్మాత్తుగా ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.

ఈయన నటన ఒక ఆద్భుతం..కానీ ఈయన మరణం ప్రేక్షకులకు తీరని లోటు. ఆయన ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్’ . కేవలం ఒక బుల్లితెర నటుడిగా కేరిర్ మొదలుపెట్టిన సుశాంత్.. పలు సీరియల్స్ చేసి ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. అలాగే ఒక రీల్ హీరోగానే కాకుండా.. రియల్ హీరోగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక మొదట సుశాంత్.. 2013లో ‘కై పో చే’ సినిమాతో హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అలా తన ఫస్ట్ మూవీతోనే నటుడిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ‘శుద్ధ దేశీ రొమాన్స్’, ‘పికె’, ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి’ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 2016లో వచ్చిన ‘ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ’ మూవీ సుశాంత్ కేరీర్ కి టర్నింగ్ పాయింట్ మారింది. భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ధోని పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించాడు సుశాంత్.

ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే 2020లో జూన్ 14న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, అతడి మరణం సూసైడ్ అంటూ అధికారులు నివేదికలో వెల్లడించగా.. కానీ, కుటుంబ సభ్యులు అభిమానులు మాత్రం అతడిది ఆత్మహత్య కాదు, హత్య అంటున్నారు. నిజానికి ఇప్పటికీ సుశాంత్ మరణం వీడని మిస్టరీ గా మారింది. ప్రస్తుతం సుశాంత్ కి సంబంధించిన రేర్ ఫోటో ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు. ఈ ఫోటో ‘సోంచిరియా’ సినిమాలోనిది.. ఇందులో లక్షణ పాత్రలో సుశాంత్ కనిపించారు. ఇక సుశాంత్ నటన పరంగానే కాకుండా.. చదువులో కూడా మంచి సత్తాను చాటాడు. ఈయన డీసీఇ ఎంట్రన్స్ పరీక్షలో 7వ ర్యాంక్ సాధించాడు. మరి, ఎంతో టాలెంటెడ్ గా తన నటనతో అలరించిన సుశాంత్ రేర్ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ranvir Shorey (@ranvirshorey)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి