iDreamPost

బాహుబలి మూవీపై మిల్కీ బ్యూటీ సంచలన కామెంట్స్!

బాహుబలి మూవీపై మిల్కీ బ్యూటీ సంచలన కామెంట్స్!

స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  సినీ పరిశ్రమకు వచ్చి 17 ఏళ్ళు దాటినా ఇప్పటికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమా అవకాశాలు సంపాదిస్తుంది. అందం, అభినయంతో ఎంతో మంది కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకుంది. తన అందచందాలతో అందరిని అలరిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. ఇటీవల బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో రిలేషన్ లో ఉందని వార్తలు రాగా తాజాగా అవును అంటూ క్లారిటీ కూడా ఇచ్చేసింది.

తమన్నా లస్ట్ స్టోరీస్ 2 సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా వరుస ఇంటర్యూలతో బిజీ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ బాహుబలి సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాహుబలి వంటి చిత్రాల వల్ల హీరోలకే గుర్తింపు వస్తుదంటూ ఈ భామ సంచలన కామెంట్స్ చేశారు. ఈ చిత్రంతో  ప్రభాస్, రానాలు గ్లోబల్  స్థాయిలో  విజయవంతమయ్యారని ఆమె అన్నారు. ఈ సినిమాలో నటించిన రమ్యకృష్ణ, అనుష్కలకు కూడా ఎంతో కొంత గుర్తింపు వచ్చిందని తెలిపింది.

బాహుబలి సక్సెస్ ని అందరూ వాడుకున్నట్టు తాను వాడుకోలేకపోయానన్నారు. తన క్యారెక్టర్ మాత్రం గెస్ట్  రోల్ గా ఉండిపోయిందని ఈ బ్యూటీ  తెలిపింది. దీంతో తగిన గుర్తింపు దక్కలేదని పేర్కొన్నారు. కానీ బాహుబలి సినిమాలో తన పాత్ర చిన్నదైనా ప్రేక్షకులకు నచ్చింది అని వ్యాఖ్యలు చేసింది. దీంతో తమన్నా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక బాహుబలి సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది.   ఈ సినిమాలో  తమన్నా అవంతిక అనే పాత్రలో కనిపించి మెప్పించింది.

అయితే బాహుబలి-1లో తమన్నా కొంచెం ఎక్కువసేపు కనిపించినా బాహుబలి-2లో మాత్రం అతిధి పాత్రలా కనిపిస్తుంది. దీంతో ఆ సమయంలో మిల్కీ బ్యూటీ పై మీమ్స్ సైతం వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ..తాజాగా ఈ అమ్మడు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ  తమన్నా అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ..బిజీ బిజీగా ఉన్నారు. మరి.. బాహుబలి సినిమాపై తమన్నా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్  తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి