iDreamPost

ఘనంగా స్టార్ హీరోయిన్ అమలా పాల్ సీమంతం.. ఫోటోస్ వైరల్

  • Published Apr 05, 2024 | 6:11 PMUpdated Apr 05, 2024 | 6:11 PM

Amala Paul Photos: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ గత కొన్నిరోజులుగా.. సోషల్ మీడియాలో తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ సీమంతం వేడుకల ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Amala Paul Photos: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ గత కొన్నిరోజులుగా.. సోషల్ మీడియాలో తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ సీమంతం వేడుకల ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Apr 05, 2024 | 6:11 PMUpdated Apr 05, 2024 | 6:11 PM
ఘనంగా స్టార్  హీరోయిన్ అమలా పాల్ సీమంతం.. ఫోటోస్ వైరల్

స్టార్ హీరోయిన్ అమలా పాల్ గురించి అందరికీ సుపరిచితమే. దాదాపు తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బ్యూటీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అంతేకాకుండా.. ఇటీవలే అమలాపాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కు జంటగా ఆడుజీవితంతో ప్రేక్షకుల అలరించింది. ఇదిలా ఉంటే.. అమలాపాల్ గతేడాది నవంబర్ లో తన ప్రియుడు గుజరాత్ కు చెందిన జగత్ దేశాయ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు తమ జీవితదంలో మరో వ్యక్తి రాబోతున్నారంటూ.. అమలాపాల్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అమలా ఫ్యాన్స్ ఈ జంటకు పెద్ధ ఎత్తునే శుభకాంక్షలు తెలిపారు. అలాగే తన ప్రెగ్నెన్సీ శుభవార్తను బయటపెట్టిన నుంచి ఈ ముద్దుగుమ్మ వరుసగా సోషల్ మీడియాలో తన బేబీ బంప్ తో ఫోటోస్ తో దర్శనమిస్తుంది. అయితే తాజాగా ఈ ఈ బ్యూటీకి సంబంధించిన సీమంత వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

టాలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ గత కొన్నిరోజులుగా.. తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అమలాపాల్ కు ఘనంగా సీమంతం వేడుకలు జరిగాయి. అయితే , ఈ వేడుకలనేవి గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించారు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు అమలా పాల్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. పైగా అందులో..ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం అమలా షేర్ చేసిన ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఈ జంటకు పెద్ద ఎత్తునే విషెస్ తెలుపుతున్నారు. అయితే అమలా పాల్ గతంలో డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. కాగా, భర్తతో విడిపోయిన తర్వాత అమలా తిరిగి సినిమాల్లో నటించింది.

ఇక సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సరసన నటించి అమలాపాల్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే.. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో కనిపించింది. కాగా, ఈమె మొదటగా.. 2009లో లాల్ జోస్ దర్శకత్వం వహించిన ‘నీలతామర’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత.. 2010లో విడుదలైన తమిళ చిత్రం ‘మైనా’ తో అమల కెరీర్ మొత్తం మారిపోయింది. ఇక సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో.. అమల్ పాల్ కు వరుస ఆవకాశాలు క్యూ కట్టాయి. అలాగే ఈ చిత్రానికి ఈ బ్యూటీకి ఉత్తమ నటిగా అవార్డ్ కూడా అందుకున్న విషయం తెలిసిందే. మరి, అమల్ పాల్ సీమంత ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి