iDreamPost

Virat Kohli: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత కోహ్లీ చూడండి ఏం చేశాడో? బయటికొచ్చిన వీడియో

  • Published Jan 01, 2024 | 6:25 PMUpdated Jan 02, 2024 | 2:23 PM

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తీవ్రంగా బాధపడుతున్న వీడియో ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఆ వీడియో చూసి.. చాలా మంది క్రికెట్‌ అభిమానులు మరోసారి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తీవ్రంగా బాధపడుతున్న వీడియో ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఆ వీడియో చూసి.. చాలా మంది క్రికెట్‌ అభిమానులు మరోసారి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Jan 01, 2024 | 6:25 PMUpdated Jan 02, 2024 | 2:23 PM
Virat Kohli: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత కోహ్లీ చూడండి ఏం చేశాడో? బయటికొచ్చిన వీడియో

2023లో భారత క్రికెట్‌ అభిమానులను ఎక్కువగా బాధపెట్టిన విషయం ఏదైనా ఉందంటే.. అది వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమి. ఆ రోజు కోట్ల మంది క్రికెట్‌ అభిమానులు రాత్రి భోజనం మానేశారు. మూడు నాలుగు రోజులు.. మౌనంగా ఉండిపోయారు. వన్డే వరల్డ్ కప్‌ టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. దీంతో.. వంద కోట్ల మందికి పైగా క్రికెట్‌ అభిమానుల హృదయాలు ముక్కలు అయ్యాయి. వరల్డ్‌ కప్‌ గెలవడమే శ్వాసగా బతికిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఏకంగా గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆ రోజు వారిని అలా చూసిన క్రికెట్‌ అభిమానులు తట్టుకోలేకపోయారు. చాలా మంది ఏడ్చేశారు. 1983, 2011 ఏడాదుల సరసన 2023 కూడా నిలిచిపోతుందని కలలు కన్న వారి కలలు కల్లలయ్యాయి. ముచ్చటగా మూడో సారి టీమిండియా విశ్వవిజేతగా నిలుస్తుందని భావిస్తే.. చివరి మెట్టుపై భారత జట్టు నిరాశ పర్చింది. టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్‌ వరకు దూసుకొచ్చింది భారత్‌. వరుసగా 10 మ్యాచ్‌లను గెలిచింది. తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాను ఓడించింది. వరల్డ్‌ కప్స్‌లో మనకు గండం అనుకునే న్యూజిలాండ్‌ను ఏకంగా రెండు సార్లు ఓడించింది. ఇక ఈ టీమ్‌కు వరల్డ్‌ కప్‌ రాక మరే జట్టుకు వస్తుందంటూ క్రికెట్‌ అభిమానులు ఫుల్‌ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు.

అయితే.. దురదృష్టవశాత్తు టీమిండియా టాస్‌ ఓడిపోవడం, ముందుగా బ్యాటింగ్‌ చేయాల్సి రావడంతో భారత విజయావకాశాలను దెబ్బతీశాయి. ఏది ఏమైనా.. ఆ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. అయితే.. ఓటమి తర్వాత టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ బాధలో చేసిన ఒక పని ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబురాలు చేసుకుంటూ ఉంటే.. తీవ్ర నిరాశలో ఉన్న కోహ్లీ.. తన క్యాప్‌తో స్టంప్స్‌పై ఉండే బెయిల్స్‌ను ఎంతో బాధతో, కోపంతో కింద పడేశాడు. ఆ సీన్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియో చూసిన అభిమానులు మరోసారి వరల్డ్‌ కప్‌ ఓటమి బాధను ఫీల్‌ అవుతున్నారు. మరి కోహ్లీ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి