iDreamPost

U19 WC 2024: ప్రపంచ రికార్డు సాధించిన భారత యువ జట్టు! చరిత్రలోనే తొలిసారి..

  • Published Feb 01, 2024 | 4:52 PMUpdated Feb 01, 2024 | 4:52 PM

అండర్-19 వరల్డ్ కప్​లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత యువ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను అందుకుంది.

అండర్-19 వరల్డ్ కప్​లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత యువ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను అందుకుంది.

  • Published Feb 01, 2024 | 4:52 PMUpdated Feb 01, 2024 | 4:52 PM
U19 WC 2024: ప్రపంచ రికార్డు సాధించిన భారత యువ జట్టు! చరిత్రలోనే తొలిసారి..

భారత యువ జట్టు అండర్-19 ప్రపంచ కప్​లో అదరగొడుతోంది. వరుస విజయాలు సాధిస్తూ దుమ్మురేపుతోంది. మన కుర్రాళ్ల జోరును అడ్డుకోవడం ఇతర జట్ల వల్ల కావడం లేదు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అండర్-19 వరల్డ్ కప్​లో ఫుల్ డామినేట్ చేస్తున్నారు. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ మనోళ్లు చెలరేగిపోతున్నారు. దీంతో భారత్​తో మ్యాచ్ అంటేనే అపోజిషన్స్ టీమ్ వణికిపోతున్నాయి. మెగాటోర్నీలో గ్రూప్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ అద్భుత విజయాలు సాధించిన యంగ్ ఇండియా.. సూపర్ సిక్స్​లోనూ బోణీ కొట్టింది. ఈ మ్యాచ్​లో ఏకంగా 214 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్​ను చిత్తు చేసింది. తద్వారా అండర్-19 వరల్డ్ కప్ హిస్టరీలో ఏ టీమ్​కూ సాధ్యం కాని ఒక రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.

అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచుల్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో నెగ్గిన ఫస్ట్ టీమ్​గా యువ భారత్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్​లో వరుసగా విజయాలు సాధిస్తున్న భారత్.. గత మూడు మ్యాచుల్లోనూ భారీ తేడాతో నెగ్గింది. జనవరి 25న ఐర్లాండ్​తో జరిగిన గ్రూప్ మ్యాచ్​లో 201 పరుగుల తేడాతో నెగ్గింది యంగ్ ఇండియా. ఆ తర్వాత యూఎస్​ఏతో జరిగిన మ్యాచ్​లో కూడా 201 పరుగుల తేడాతోనే విజయం సాధించింది. అనంతరం న్యూజిలాండ్​తో జరిగిన సూపర్​ సిక్స్​ మ్యాచ్​లో 214 పరుగుల తేడాతో నెగ్గి అరుదైన రికార్డును తమ అకౌంట్​లో వేసుకుంది. అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో ఒక జట్టు వరుసగా మూడు మ్యాచుల్లో 200 అంతకంటే పరుగుల తేడాతో నెగ్గడం ఇదే ఫస్ట్ టైమ్.

ఇక, మెగాటోర్నీలో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న యంగ్ ఇండియా అనధికారికంగా సెమీఫైనల్ బెర్త్​ను ఖరారు చేసుకుంది. ఈసారి వరల్డ్ కప్​లో భారత్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సూపర్ సిక్స్​లో భాగంగా తదుపరి మ్యాచ్​లో నేపాల్​ (ఫిబ్రవరి 2)తో తలపడనుంది. ఈ మ్యాచ్​లో నెగ్గితే సెమీస్ బెర్త్ అధికారికంగా కన్ఫర్మ్ అవుతుంది. కాగా, ఈ టోర్నీలో యంగ్ ఇండియా తరఫున అందరు ఆటగాళ్లు అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. అందుకే భారీ తేడాతో టీమ్ విజయాలు సాధిస్తోంది. ఈ టోర్నీలో ముషీర్ ఖాన్ (325 పరుగులు) టాప్ స్కోరర్​గా ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో అతడు 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ బాదాడు. బౌలింగ్ విభాగంలో సౌమీ పాండే (12 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్​గా కొనసాగుతున్నాడు. మరి.. అండర్-19 వరల్డ్ కప్​లో భారత జట్టు పెర్ఫార్మెన్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి