iDreamPost

10th క్లాస్ పిల్లలకి ఎర.. కూతురి ద్వారా వ్య*భిచారం! ఇలాంటి మహిళని చూసుండరు!

ప్రస్తుత సమాజంలో సంపాదన కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. కొందరు మహిళలు చేసే గలీజ్ దందా చూస్తే అసహ్యం వేస్తుంది. తాజాగా ఓ 37 ఏళ్ల మహిళ చేసిన పనికి పోలీసులు సైతం షాకయ్యారు.

ప్రస్తుత సమాజంలో సంపాదన కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. కొందరు మహిళలు చేసే గలీజ్ దందా చూస్తే అసహ్యం వేస్తుంది. తాజాగా ఓ 37 ఏళ్ల మహిళ చేసిన పనికి పోలీసులు సైతం షాకయ్యారు.

10th క్లాస్ పిల్లలకి ఎర.. కూతురి ద్వారా వ్య*భిచారం! ఇలాంటి మహిళని చూసుండరు!

నేటికాలంలో సంపాదన కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. వ్యభిచారాలు, డ్రగ్స్ సరఫరా వంటివి చేస్తూ భారీగా డబ్బులు కూడబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు చేసే గలీజ్ దందా చూస్తే అసహ్యం వేస్తుంది. తాజాగా ఓ 37 ఏళ్ల మహిళ చేసిన పనికి పోలీసులు సైతం షాకయ్యారు. మైనర్ పిల్లల చేత వ్యభిచారం చేసి…భారీగా డబ్బులు సంపాందిచింది. తాజాగా పోలీసులు దాడులు చేయడంతో ఈ కిలాడీ వ్యవహరం బయటపడింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో స్కూల్ విద్యార్థినులతో వ్యభిచారం చేయించే నదియా అనే 37 ఏళ్ల మహిళతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక పోలీసులు జరిపిన విచారణలో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. చెన్నైలో పాఠశాల విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని పోలీసు కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్‌కు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై చర్యలు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సెల్వరాణి బృందం విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారం మేరకు చెన్నై వలసరవాక్కం జైనగర్ 2వ వీధిలోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు.

పోలీసులు దాడులు చేసిన సమయంలో 17 ఏళ్ల బాలికతో ఓ 70 ఏళ్ల వృద్దుడు పట్టుబడ్డాడు. ఇక నిందితుడిని విచారించగా.. నదియా వ్యవహరం బయటకు వచ్చింది. నదియా(37) అనే మహిళ తనకు బాలికను పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. దీంతో నదియా, ఆమె సోదరి సుమతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నిందితురాలు నదియా కుమార్తె ఇంటర్ సెకండియర్ చదువుతోంది. నదియా తన కుమార్తెను పాఠశాలలో తనతో పాటు చదువుకునే అందమైన, పేద విద్యార్థులను ఇంటికి తీసుకురావాలని చెప్పేది.

తన తల్లి చెప్పినట్లుగానే ఆమె కూతురు కూడా తన తోటి విద్యార్థులను రోజూ తీసుకొచ్చింది. తల్లితో పాటు ఒంటరిగా ఉన్న బాలికలను, పేదరికంతో ఉన్న బాలికలను డబ్బు ఆశ చూపేది. వారిని వ్యభిచారంలోకి దింపి..ఆమె లక్షలకు గడించింది. స్థానికంగా ఉన్న బ్రోకర్ల ద్వారా ఈ కిలాడీ చేతికి చిక్కిన అమ్మాయిలను లాడ్జీలకు పంపించి సెOక్స్ వర్క్‌లు చేయిస్తున్నట్లు కూడా బట్టబయలైంది. ఒక రాత్రికి రూ.25 నుంచి రూ.35 వేలు బేరం పెట్టి సోదరి భర్త రామచంద్రన్‌తో కలిసి ఆటోలో పంపించేది.

చివరకు పోలీసుల దాడులతో ఈ కిలాడీ చీకటి వ్యవహారం బయట పడింది. పోక్సో చట్టం కింద నదియా (37), ఆమె సోదరి సుమతి (43), ఆమె సోదరి రెండవ భర్త రామచంద్రన్ (42), నేపాల్ యువతి మాయా ఓలి (29),  అశోకుమార్ (31) లను అరెస్టు చేశారు. అలానే సైదపేటకు చెందిన 70 ఏళ్ల వ్యక్తితో సహా 7 మందిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేశారు. రక్షించిన ఇద్దరు బాలికలను ప్రభుత్వ వసతి గృహాలకు తరలించారు. ఈ ఘటనపై శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టు చేసిన బ్రోకర్ల నుంచి 7 సెల్ ఫోన్లు, లగ్జరీ కారును స్వాధీనం చేసుకున్నారు. అమయాకు పిల్లల జీవితాలతో ఆడలాడుతున్న ఇలాంటి మహిళలను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి