Keerthi
Mathuvadalara 2 OTT: కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో అలరించిన తాజాగా చిత్రం మత్తువదలరా 2. అయితే నేడు ఈ మూవీ థియేటర్స్ లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మత్తువదలరా 2 మూవీ తాజాగా ఓటీటీ పార్టనర్ లాక్ అయ్యింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో ఆ వివరాలను తెలుసుకుందాం.
Mathuvadalara 2 OTT: కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో అలరించిన తాజాగా చిత్రం మత్తువదలరా 2. అయితే నేడు ఈ మూవీ థియేటర్స్ లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మత్తువదలరా 2 మూవీ తాజాగా ఓటీటీ పార్టనర్ లాక్ అయ్యింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో ఆ వివరాలను తెలుసుకుందాం.
Keerthi
ప్రస్తుతం సిని ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా ఎక్కువగా నడుస్తోంది. ముఖ్యంగా ఒకే కథను రెండు మూడు భాగాలుగా ప్రేక్షకులకు చెప్పేందుకు మూవీ మేకర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ తరహా ట్రెండ్ లో పెద్ద సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాలు వరకు ప్రతిది ప్రాంఛైజీ మూవీగానే తెరకెక్కించి మంచి హిట్ ను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు (శుక్రవారం సెప్టెంబర్ 13న) థియేటర్ లో రిలీజైన ‘మత్తు వదలరా 2’ మూవీ కూడా మంచి పాజిటివ్ టాక్ తో హిట్ ను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ 2019లో చిన్న సినిమాగా రిలీజైన మత్తు వదలరా కు సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే అప్పటిలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ను డబుల్ చేయడానికి మత్తువదలరా 2 తో కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా, ఈ మూవీకి రితేష్ రానా దర్శకత్వం వహించాడు. ఇందులో ఫరియా అబ్బుల్లా హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీపై రిలీజ్కు ముందే నుంచే ప్రేక్షకుల్లో మంచి బజ్ నడుస్తోంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులకు ఈ మూవీ పై భారీ అంచనాలు పెంచాశాయి. ఈ క్రమంలోనే నేడు థియేటర్ లో సినిమా చూసిన ప్రేక్షకులు మూవీ చాలా బాగుందంటూ పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఇకపోతే మత్తువదలరా 2 మూవీ తాజాగా ఓటీటీ పార్టనర్ లాక్ అయ్యింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో ఆ వివరాలను తెలుసుకుందాం.
నేడు థియేటర్లో విడుదలైన మత్తువదలరా 2 మూవీని.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ పార్ట్నర్ గా హక్కులను దక్కించుకుంది. అయితే ఈ విషయంపై ఇంక అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రంకు ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ ఎంతకు సొంతం చేసుకుంది, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలపై కూడా ఎక్కడ ఎలాంటి సమాచారం రాలేదు. కానీ, త్వరలోనే ఈ విషయం పై మూవీ మేకర్స్ కానీ, నెట్ఫ్లిక్స్ సంస్థ నుంచి కానీ ఆఫిషియల్ గా ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరీ, మత్తువదలరా 2 మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీ పార్ట్నర్ గా హక్కులను సొంతం చేసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.