ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భారత జట్టు విజయయాత్రకు అడ్డే లేకుండా పోతోంది. లీగ్ దశలో ఓటమి అనేదే లేకుండా ఎదురు వచ్చిన ప్రత్యర్థులను చితగ్గొడుతూ వచ్చింది టీమిండియా. అదే జోరును సెమీ ఫైనల్లోనూ కొనసాగించింది మెన్ ఇన్ బ్లూ టీమ్. సెమీస్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 51 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. కీలకమైన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్-ఎ 211 రన్స్కు ఆలౌట్ అయింది. అనంతరం ఛేజింగ్కు దిగిన బంగ్లాదేశ్-ఎ 160 రన్స్కే చాప చుట్టేసింది. భారత బౌలర్లలో నిశాంత్ 5, మనవ్ 3 వికెట్లతో ప్రత్యర్థి భరతం పట్టారు.
నిశాంత్, మనవ్కు అభిషేక్ శర్మ, యువరాజ్ సింగ్ దోడియా ఒక్కో వికెట్ తీసి మంచి సహకారం అందించారు. బంగ్లాపై గెలుపుతో ఎమర్జింగ్ టీమ్స్ టోర్నీలో భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇప్పటికే పాకిస్థాన్-ఎ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ రెండు జట్ల మధ్య కప్ కోసం ఫైట్ జరగనుంది. మామూలుగానే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అందరిలోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటిది ఫైనల్ మ్యాచ్లో దాయాదులు తలపడితే వచ్చే కిక్ వేరనే చెప్పాలి. ఫైనల్ ఫైట్లో పాక్ను చితగ్గొట్టేందుకు భారత్ జట్టు సన్నద్ధమవుతోంది.
ఇక, ఈ టోర్నీ ఫైనల్స్కు చేరుకునే క్రమంలో సెమీ ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకతో తలపడింది పాకిస్థాన్. శుక్రవారం జరిగిన ఫస్ట్ సెమీస్లో తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 322 పరుగుల భారీ స్కోరు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 45.4 ఓవర్లలో 262 రన్స్కే ఆలౌట్ అయింది. దీంతో పాక్ జట్టు 60 రన్స్ తేడాతో మ్యాచ్లో గెలిచి ఫైనల్స్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో పాక్ బౌలర్లలో అర్షద్ ఇక్బాల్ 5 వికెట్లతో చెలరేగాడు. అతడికి ముబాసిర్ ఖాన్, సుఫియాన్ ముఖీమ్ చెరో రెండు వికెట్లు తీసి చక్కటి సహకారం అందించారు.
INDIA QUALIFIED INTO THE FINAL OF EMERGING ASIA CUP.
India vs Pakistan final on Sunday. pic.twitter.com/dalJYcjz3h
— Johns. (@CricCrazyJohns) July 21, 2023