iDreamPost

ఇద్దరు టాప్ స్టార్ల సినిమాల్లో కీలక పాత్రలు

ఇద్దరు టాప్ స్టార్ల సినిమాల్లో కీలక పాత్రలు

గత రెండు రోజులుగా మెగాస్టార్ చిరంజీవి నటించబోయే వేదాళం తెలుగు రీమేక్ లో కీర్తి సురేష్ ఆయనకు చెల్లిగా నటించబోతోందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నిర్మాతలు కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని అందులో చెప్పుకొచ్చారు. ఎంతో కొంత నిజం లేనిదే ఇంత బలంగా ప్రచారం జరగదు కాబట్టి వాస్తవమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో ఇలా సిస్టర్ క్యారెక్టర్లు చేయడం ఎందుకనే అనుమానం అభిమానుల్లో రావడం సహజం. ఎందుకంటే వేదాళంలోనూ అది స్టార్ హీరోయిన్ చేసిన పాత్ర కాదు. అందుకే ఇంత చర్చ.

దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది చిరంజీవి సినిమాలో నటించే అవకాశం కీర్తిసురేష్ లాంటి వాళ్లకు మళ్ళీ మళ్ళీ దక్కకపోవచ్చు. ఆయనతో హీరోయిన్ గా చేస్తే ఇబ్బంది కానీ చెల్లిగా అయితే ఓకే. తల్లి మేనక నలభై ఏళ్ళ క్రితం మెగాస్టార్ తో పున్నమినాగు లాంటి సూపర్ హిట్ లో నటించిన రికార్డు ఉంది. సో ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత ఆయన చిత్రంలో ఆవిడ కూతురు చేయడం అంటే అదో విశేషమే. దానికి తోడు రజనీకాంత్ అన్నాతేలో కూడా కీర్తి సురేష్ ఇదే తరహా పాత్ర చేసినట్టు ఇప్పటికే చెన్నై టాక్ ఉంది. సో ఒకే సమయంలో ఇద్దరు సౌత్ ఇండియన్ టాప్ స్టార్ సినిమాల్లో నటించిన ఘనత దక్కినట్టు అవుతుంది.

అన్నిటి కంటే ఎక్కువగా కీర్తి సురేష్ సర్కారు వారి పాట కోసం ఎదురు చూస్తోంది. మహేష్ బాబు సరసన మొదటిసారి జోడి కట్టిన మూవీ కావడంతో ఇది కనక బ్లాక్ బస్టర్ అయితే మరో సారి పెద్ద బ్రేక్ దక్కినట్టు అవుతుంది. మహానటి తర్వాత తనకు ఆ స్థాయి విజయం తెలుగులో మళ్ళీ దక్కలేదు. విశాల్, విక్రమ్ లాంటి స్టార్ల సరసన చేసిన రెగ్యులర్ హీరోయిన్ వేషాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. అందుకే ఇప్పుడు సర్కారు వారి పాటతో గట్టి టార్గెట్ పెట్టుకుంది. 2022 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ మూవీలో తన పాత్ర పరిధి ఎంత ఎన్ని పాటలు ఉంటాయనే దాని మీద ఇంకా స్పష్టత రావాలి

Also Read : కామెడీ క్లాసిక్ కి లాక్ డౌన్ టచ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి