iDreamPost

ఏపీలో తాజాగా 50 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో తాజాగా 50 మందికి కరోనా నిర్దారణ

రెండువేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే మరో 7 కేసులు పెరిగాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 50 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1980 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా  925 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 1010 గా నమోదయింది.గడచిన 24 గంటల్లో కర్నూలులో ఒకరు మరణించారు.దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో  రాష్ట్రంలో 50 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధికంగా చిత్తూరులో 16,కర్నూల్ లో 13 మందికి కరోనా సోకగా, అనంతపురంలో 5, విశాఖపట్నంలో ,గుంటూరులో 6,ప్రకాశంలో 2, కృష్ణాలో ఒకరికి కరోనా వైరస్ నిర్దారణ అయింది. దీంతో మొత్తం 50 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి