iDreamPost

రాజారెడ్డి నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్ దంపతులు!

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ లో పర్యటించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఆయన మేనల్లుడు, వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, నిశ్చితార్థానికి హాజరయ్యారు.

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ లో పర్యటించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఆయన మేనల్లుడు, వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, నిశ్చితార్థానికి హాజరయ్యారు.

రాజారెడ్డి నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్ దంపతులు!

గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ వచ్చారు. తన సోదరి వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరయ్యారు. గురువారం సాయంత్రం 6 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని రోడ్డు మార్గంలో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు చేరుకున్నారు. అక్కడ జరిగిన రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. కాబోయే వధువరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. అనంతరం తిరిగి హైదరాబాద్ నుంచి తాడేపల్లికి  సీఎం జగన్ దంపతులు బయలు దేరనున్నారు.

హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో షర్మిల, బ్రదర్ అనిల్ దంపతులు కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరుగుతోంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవలే అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లెడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలటిక్స్ ఎంఎస్ పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఇవ్వాళ గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది. 2024 ఫిబ్రవరి 17 వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి