iDreamPost
iDreamPost
సంప్రదాయ వస్త్రాల్లో క్యాట్ వాక్, అడిగిన ప్రశ్నలకు తడబడని జవాబులు, విమెన్ యాటిట్యూడ్, అదే సమయంలో స్పోర్ట్ స్పిరిట్ ఇవీ…మిస్ అండ్ మిసెస్ ఉత్తరాంధ్ర–2022 పోటీల్లో కనిపించిన దృశ్యాలు. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో వైజాగ్ లో నిర్వహించిన పోటీల్లో యువతలు, మహిళలు పాల్గొన్నారు. పోటీపడ్డారు. అటు అందానికి, ఇటు ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపాల్లా కనిపించారు.
ఫైనల్స్లో 20 మంది పాల్గొనగా మిస్ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి, మిసెస్ ఉత్తరాంధ్రగా భాగ్యలక్ష్మి నిలిచారు.
విజేతలకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ బహుమతులు అందజేశారు.